మహేశ్‌ నెక్ట్స్‌ పరశురామ్‌తో ఫిక్స్‌!

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఏ దర్శకుడితో పనిచేయనున్నారనే విషయంలో సినీ ప్రియుల్లో ఎప్పటినుంచే ఆసక్తి నెలకొని ఉంది. SSMB28 చిత్రానికి సంబంధించి ఎందరో దర్శకుల పేర్లు కూడా వినపడ్డాయి. ఈ నేపథ్యంలో

Updated : 01 May 2020 10:00 IST

హైదరాబాద్‌: ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఏ దర్శకుడితో పనిచేయనున్నారనే విషయంలో సినీ ప్రియుల్లో ఎప్పటినుంచే ఆసక్తి నెలకొని ఉంది. SSMB28 చిత్రానికి సంబంధించి ఎందరో దర్శకుల పేర్లు కూడా వినపడ్డాయి. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు తన తదుపరి చిత్రాన్ని ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్‌తో చేయనున్నారు.

ఈ విషయంపై దర్శకుడు పరశురామ్‌ మాట్లాడుతూ.. ‘మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘ఒక్కడు’ సినిమా నేను తెలుగు సినీ పరిశ్రమవైపు అడుగులు వేసేలా చేసింది. మహేశ్‌బాబు సర్‌తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచే అనుకుంటున్నాను. ఇప్పటికీ నా కల నేరవేరుతోంది. ఓ అద్భుతమైన కథతో మేము మీ ముందుకు రానున్నాం. ఈ సినిమా తప్పకుండా ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమవుతుంది. ఎలివేషన్‌ సీన్స్‌ను రాయలేకకాదు.. అవసరం రాలేదు. కానీ ఇప్పుడు నాలోని ఆ యాంగిల్‌ను కూడా చూస్తారు’ అని తెలియజేశారు.

నిఖిల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘యువత’ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమైన పరశురామ్ ఆ తర్వాత ‘సోలో’ సినిమాతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. 2018లో విడుదలైన ‘గీతగోవిందం’ సినిమా పరశురామ్‌ కెరీర్‌కు ఓ మంచి విజయాన్ని అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని