God Se: సత్యదేవ్‌ ‘గాడ్సే’, కార్తి ‘విరుమన్‌’.. విడుదల ఎప్పుడంటే?

సత్యదేవ్‌ హీరోగా రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్సే’ చిత్రం వాయిదా పడింది.

Published : 18 May 2022 19:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సత్యదేవ్‌ హీరోగా రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్సే’ విడుదల వాయిదా పడింది. మే 20న ప్రేక్షకుల ముందుకురావాల్సిన ఈ సినిమా జూన్‌ 17న విడుదల కానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం వెల్లడించింది. ‘బ్లఫ్‌ మాస్టర్‌’ తర్వాత సత్యదేవ్‌- దర్శకుడు గోపీ గణేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన రెండో చిత్రమిది. సి.కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక.  ఈ సినిమాకి సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.సురేశ్‌.

విరుమన్‌ ఆగమనం ఆ రోజే

ముత్తయ్య దర్శకత్వంలో కార్తి నటిస్తున్న చిత్రం ‘విరుమన్‌’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్‌ యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 31న విడుదలకానుంది. సామాజిక మాధ్యమం ద్వారా ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను పంచుకుంది. ఇందులో కార్తి కళ్లద్దాలు పెట్టుకుని, నవ్వుతూ కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని