Round Up 2022: సక్సెస్ సొగసులెన్ని?
చిత్రసీమలో విజయాలున్న కథానాయికలకి తిరుగే ఉండదు. ఇక స్టార్ హోదా కూడా దక్కించుకున్నారంటే అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించే అవకాశాలు వరుస కడతాయి.
2022లో అలరించిన అగ్ర కథానాయికలు
చిత్రసీమలో విజయాలున్న కథానాయికలకి తిరుగే ఉండదు. ఇక స్టార్ హోదా కూడా దక్కించుకున్నారంటే అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటించే అవకాశాలు వరుస కడతాయి. వాళ్ల కోసం దర్శకనిర్మాతలు చిత్రీకరణలు కూడా వాయిదా వేసుకుంటారు. మార్కెట్పై అంతగా ప్రభావం చూపిస్తుంటారు. ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నా... పోటీ పెరిగినా... కొద్దిమంది కథానాయికలు మాత్రం ఇప్పటికీ జోరు చూపిస్తున్నారు. 2022లో వాళ్ల ప్రభావం ఎలా సాగిందో తెలుసుకుందాం...
తెలుగులో ఒకప్పుడు అగ్ర కథానాయికలు కొద్దిమందే కనిపించేవాళ్లు. ఇప్పుడు వాళ్ల సంఖ్య ఎక్కువే. ఎప్పట్నుంచో కొనసాగుతున్న సీనియర్ భామలు పట్టు వదలకుండా ఫామ్ని కొనసాగిస్తుండడం.... వాళ్లకి దీటుగా యువ భామలూ సత్తా చాటుతుండడం... పోటీగా కొత్త కథానాయికలూ దూసుకొచ్చి అదిరిపోయే విజయాలు సొంతం చేసుకొంటుండడమే అందుకు కారణాలు. అనుష్కశెట్టి మొదలుకొని... కొత్త భామలు కీర్తిశెట్టి, శ్రీలీల వరకూ ఇప్పుడు స్టార్ భామలే. అయితే ఈసారి సీనియర్ల కంటే యువతరమే ఎక్కువగా ప్రభావం చూపించింది. అనుష్కశెట్టి, కాజల్, రకుల్ప్రీత్ సింగ్ తదితరులు ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించనేలేదు. అనుష్క కొన్నాళ్లపాటు విరామం తీసుకోవడడం, ఆ తర్వాత తగిన కథల కోసం అన్వేషణ కొనసాగించే క్రమంలో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి యు.వి.క్రియేషన్స్ సంస్థలో ఓ చిత్రం చేస్తున్నారు. మహేష్ దర్శకుడు. మరో కథానాయిక కాజల్ ‘ఆచార్య’తో సందడి చేస్తుందనుకున్నా, కథ నుంచి ఆమె నటించిన సన్నివేశాల్ని తొలగించడంతో సాధ్యం కాలేదు. పెళ్లయ్యాక కూడా ఆ సినిమా కోసం ఆమె సెట్కి వచ్చింది. ఆ తర్వాత గర్భం దాల్చడంతో ఆమె సినిమాలు ఒప్పుకోలేదు. గతేడాదైనా ‘కొండపొలం’తో సందడి చేసిన రకుల్ప్రీత్ సింగ్ ఈ ఏడాది పూర్తిగా హిందీకే పరిమితమైంది..
జోరు కొనసాగుతోంది
పూజాహెగ్డే, రష్మిక, కీర్తిసురేష్, సాయిపల్లవి... రెండు మూడేళ్లుగా పెద్ద సినిమాల్ని, కాంబినేషన్లని ప్రభావితం చేస్తున్న కథానాయికలు వీళ్లు. పూజాహెగ్డే ఈసారి అనువాద చిత్రం ‘బీస్ట్’ మొదలుకొని మొత్తం నాలుగు సినిమాలతో సందడి చేసింది. ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’లో ఆమె కథానాయికగా నటించింది. ‘ఎఫ్3’లో ప్రత్యేకగీతంతో సందడి చేసింది. విజయాలు దక్కలేదు కానీ, పూజా జోరు మాత్రం కొనసాగుతోంది. కమర్షియల్ కథానాయిక అనిపించుకున్న ఆమె ఇప్పటికే మహేష్బాబు - త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది. మరికొన్ని కీలకమైన ప్రాజెక్టుల విషయంలో ఆమె పేరు వినిపిస్తోంది. మరోభామ రష్మిక ఈ ఏడాది ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’, ‘సీతారామం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘సీతారామం’ ఘన విజయాన్ని సాధించగా, ‘ఆడవాళ్లు... ’ పర్వాలేదనిపించింది. ఈ ఏడాది హిందీ కెరీర్పై ప్రధానంగా దృష్టి సారించింది. ఆమె నటించిన హిందీ చిత్రం ‘మిషన్ మజ్ను’తోపాటు, ‘వారసుడు’ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం ‘పుష్ప2’తోపాటు, రణ్బీర్ కపూర్ చిత్రం ‘యానిమల్’ చిత్రాలపై దృష్టి పెట్టింది రష్మిక. ‘సర్కారు వారి పాట’ సినిమాతో ఈ ఏడాది కీర్తిసురేష్ పేరు మార్మోగిపోయింది. కానీ ఆ చిత్రం ఫర్వాలేదనిపించింది. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం ‘గుడ్ లక్ సఖి’ కూడా ఫలితాన్నివ్వలేదు. దాంతో ఆమెకి ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. కొత్త అవకాశాల పరంగా మాత్రం ఆమె దూకుడు కొనసాగింది. నానితో కలిసి ‘దసరా’, చిరంజీవికి చెల్లెలిగా ‘భోళాశంకర్’ చిత్రాల్లో నటిస్తోంది. కథల ఎంపికలో ఆచితూచి అడుగులేసే సాయిపల్లవి ఈసారి ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల ముందుకొచ్చారు. రానాతో కలిసి నటించిన ‘విరాటపర్వం’ ఆమెకి మరోసారి మంచి పేరు తీసుకొచ్చింది. ‘గార్గి’ అనువాదంగా తెలుగులోనూ విడుదలై మంచి వసూళ్లనే రాబట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కొనసాగుతుండడంతో కథానాయికలు ఇదివరకటిలా ఒకే సినిమాకి పరిమితం కావడం లేదు. ఏ భాషలో నటించినా అవి అన్ని భాషల్లోనూ విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో, మంచి కథ ఎక్కడి నుంచి వస్తే అక్కడ నటించేందుకు సై అంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ... ఇలా అన్ని భాషల్లోనూ మన కథానాయికలు రాణించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి కథానాయికలు కూడా తెలుగులో అవకాశాల్ని అందుకొంటున్నారు.
అవకాశాలతో హవా
సీనియర్లలో శ్రుతిహాసన్, సమంత, తమన్నాలు మాత్రం ఈ ఏడాది కూడా వరుస అవకాశాలతో హవాని కొనసాగించారు. శ్రుతిహాసన్ ఈ ఏడాదిలో తెరపై కనిపించలేదన్న మాటే కానీ, ఆమె సినిమాలతో బిజీ బిజీగా గడిపారు. సంక్రాంతికి ఆమె నటించిన ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఈసారి సంక్రాంతి సందడంతా ఆమెదే. మరోవైపు ప్రభాస్తో కలిసి ‘సలార్’లో నటిస్తోంది. సమంత, తమన్నాలు మాత్రం తెరపై సందడి చేశారు. సమంత ‘యశోద’గా వచ్చి, విజయాన్ని అందుకుంది. ‘శాకుంతలం’, ‘ఖుషి’ సినిమాల చిత్రీకరణలో కూడా పాల్గొన్నారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా విరామం తీసుకుంటున్నారు. తమన్నాకి ఘన విజయాలు దక్కలేదేమో కానీ... ‘ఎఫ్3’తో కొన్ని వినోదాలు పంచింది. ఆమె నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలైంది. మరోవైపు హిందీలో ‘బబ్లీ బౌన్సర్’, ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ చిత్రాలు చేసింది. అవి ఓటీటీలోనే విడుదలయ్యాయి. కొత్త అవకాశాల విషయానికొస్తే ఆమె చేతిలో ‘భోళా శంకర్’ ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’లపై ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
Arya: ‘అ అంటే అమలాపురం’.. 20 ఏళ్లయినా అదే గ్రేస్తో అదరగొట్టిన అభినయశ్రీ!
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ను మలుపు తిప్పిన చిత్రంగా ‘ఆర్య’ నిలిచిపోతుంది. అప్పట్లో ఈ సినిమాలోని ‘‘అ అంటే అమలాపురం..’’ పాట యువతను ఉర్రూతలూగించింది. ఆ పాటలో అభినయశ్రీ తన డ్యాన్స్తో అదరగొట్టింది. తాజాగా నిర్వహించిన వేడుకలో ఆమె మరోసారి అదే పాటకు స్టెప్పులేసి అలరించింది.
-
Allu Arjun: ‘ఆర్య’.. నా కెరీర్ని ట్రాక్లోకి తీసుకొచ్చింది: అల్లుఅర్జున్
తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు అని ప్రముఖ నటుడు అల్లుఅర్జున్ (Allu Arjun) అన్నారు. ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం రాత్రి హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ వేడుకని నిర్వహించింది.
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అదాశర్మ కీలక పాత్రలో నటించిన ‘బస్తర్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
Pushpa: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక హరీశ్ శంకర్
Pushpa 2: The Rule: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం
‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. దీనికి జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. -
ఊరిస్తున్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్. ‘వార్ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. -
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. -
మెరుపుల తార.. తళుకుల చీర
అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక అలియా భట్ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక ‘మెట్ గలా’లో ఆమె చీరలో మెరిసింది. -
రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘డియర్ స్టూడెంట్స్’ సందడి మొదలు
ఇటీవలే ‘డియర్ స్టూడెంట్స్’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రాయ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. -
జులై 20న.. కౌలాలంపూర్లో
తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM