NTR30: స్మార్ట్‌గా యంగ్‌ టైగర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాలశివ దర్శకత్వంలో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ ఆర్ట్స్, యువ సుధా....

Updated : 20 May 2021 08:38 IST

హైదరాబాద్‌: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు. గురువారం తారక్‌ పుట్టినరోజు సందర్భంగా NTR30 టీమ్‌ ఓ సరికొత్త ఫొటోని షేర్‌ చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ స్మార్ట్‌ లుక్‌తో ఇన్‌షర్ట్‌ చేసుకుని క్లాసీ, ప్రొఫెషనల్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ యంగ్‌ టైగర్‌ అభిమానుల్ని ఎంతో ఆకట్టుకుంటోంది. అయితే, తారక్‌ తన 30వ చిత్రాన్ని మొదట త్రివిక్రమ్‌తో ప్రకటించిన విషయం తెలిసిందే. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ని ప్రస్తుతానికి పక్కనపెట్టారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆయన కొమురంభీమ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. ఇందులో ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్‌.. కొరటాల శివ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నారు. అలాగే శివ సైతం ప్రస్తుతం ‘ఆచార్య’తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని