Naga Vamsi: మీ మాటలకు మేము ఎంత ఫీలవుతామో అర్థం చేసుకోండి: నాగవంశీ
ట్రోలర్స్ను ఉద్దేశిస్తూ వరుస ట్వీట్స్ చేశారు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) నిర్మాత నాగవంశీ (Naga Vamsi). వ్యక్తిగత దూషణలకు పాల్పడకుండా అభిప్రాయాలను తెలియజేస్తే.. వాటిని స్వాగతిస్తామని అన్నారు.
హైదరాబాద్: ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సెకండ్ సింగిల్ విడుదలయ్యాక పలువురు నెటిజన్ల నుంచి వస్తోన్న ట్రోల్స్పై నిర్మాత నాగవంశీ (Naga Vamsi) స్పందించారు. ‘మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు. జనవరి 12న కలుద్దాం’ అంటూ ట్రోలర్స్కు గట్టిగా సమాధానం చెప్పారు. ఈ పోస్ట్ వైరల్గా మారిన కొంతసమయానికి ఆయన మరో ట్వీట్ చేశారు. సరైన పద్ధతిలో అభిప్రాయాన్ని తెలియజేయాలని.. అలాంటి వాటిని తాము ఎప్పటికీ ఆహ్వానిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.
‘‘(మొదట పెట్టిన ట్వీట్ను ఉద్దేశిస్తూ).. ఒక నిర్మాతగా నేను పెట్టిన పోస్ట్ మిమ్మల్ని బాధించింది కదా. తమ వృత్తిని నిర్వర్తిస్తున్న మా టీమ్ సభ్యులపై రోజు విడిచి రోజు వ్యక్తిగత దూషణలకు పాల్పడితే మేము ఎంతలా ఫీలవుతామో అర్థం చేసుకోండి. అసభ్యకరమైన పదజాలం, వ్యక్తిగత దూషణలు లేని అభిప్రాయాలను మేము స్వాగతిస్తున్నాం. మర్యాదకరమైన మాటలతోనూ మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. మునుపెన్నడూ చూడని మాస్ అవతార్లో మహేశ్బాబు ఈ సినిమాలో కనిపిస్తారని ఆయన తెలిపారు.
రవితేజ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ అంటూ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్
అసలేం జరిగిందంటే: మహేశ్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుస ప్రచార చిత్రాలను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ‘ఓ మై బేబీ’ పాట విడుదలైంది. 2.59 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. అయితే, ఈ పాట తమకు నచ్చలేదంటూ పలువురు నెటిజన్లు నెట్టింట పోస్టులు పెట్టారు. సంగీత దర్శకుడు తమన్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి వర్క్పై విమర్శలు చేశారు. దీనిపై రామజోగయ్య శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దురుద్దేశంతో టెక్నీషియన్స్ను టార్గెట్ చేయడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ తాజాగా ఈ ట్వీట్స్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’