Nagarjuna: నాగచైతన్య, సమంత విడిపోవటంపై స్పందించిన నాగార్జున

నాగచైతన్య, సమంతలు విడిపోవటం నిజంగా దురదృష్టకరమని సినీ నటుడు, నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున విచారం వ్యక్తం చేశారు

Published : 03 Oct 2021 01:11 IST

హైదరాబాద్‌: నాగచైతన్య, సమంతలు విడిపోవటం నిజంగా దురదృష్టకరమని సినీ నటుడు, నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున(Nagarjuna) విచారం వ్యక్తం చేశారు. చై-సామ్‌లు విడిపోతున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరువురు తెలిపారు. ఈ నేపథ్యంలో నాగార్జున ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘‘ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది. సామ్‌, చైలు విడిపోవటం నిజంగా దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. ఆమె మా కుటుంబానికి చాలా దగ్గరైంది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’’

-ట్విటర్‌లో నాగార్జున

గత కొన్ని రోజులుగా నాగచైతన్య, సమంతలు విడిపోతారని వార్తలు వినిపించినా, నిజం కాదేమోనని అభిమానులు ఆశపడ్డారు. ఈ రోజు స్వయంగా వారే ప్రకటించడంతో సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు విచారం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని