Nani: శనివారం సరిపోదంటారా!

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. ‘అంటే సుందరానికీ’ సినిమా తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది.

Updated : 25 Oct 2023 13:28 IST

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. ‘అంటే సుందరానికీ’ సినిమా తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దసరా సందర్భంగా మంగళవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్‌ క్లాప్‌ కొట్టగా.. దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఎస్‌.జె.సూర్య గౌరవ దర్శకత్వం వహించారు. ఇదొక భిన్నమైన కథాంశంతో రూపొందనున్న చిత్రం. మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే హీరో కథగా ఉంటుంది. యాక్షన్‌కు.. వినోదానికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది. ఇందులో నానికి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తోంది. ఎస్‌.జె.సూర్య ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, ఛాయాగ్రహణం: జి.మురళి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని