Extra Ordinary Man: మంచి బిర్యానీ తినిపించడం గ్యారంటీ

నితిన్‌ కథానాయకుడిగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్. ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించారు.

Updated : 03 Dec 2023 07:04 IST

నితిన్‌ కథానాయకుడిగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్. ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ఒలే ఒలే పాపాయి.. పలాసకే వచ్చేయి అనే పాటను ఈ నెల 4న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ప్రోమోను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నితిన్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రం చాలా ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎక్స్‌ట్రార్డినరీగా ఉండనుంది అన్నారు. వక్కంతం వంశీ మాట్లాడుతూ..ట్రైలర్‌ చూసిన వాళ్లంతా సినిమా ఇలాగే ఉంటుందా అని అడుగుతున్నారు. ఈ సినిమా దీనికి పదింతలు ఉంటుంది. తప్పకుండా మంచి బిర్యానీ తినిపిస్తా. ఇదైతే గ్యారంటీ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, సుధాకర్‌ రెడ్డి, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని