Samyuktha: సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్తోనూ ఓ చిత్రం చేస్తోంది.
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్తోనూ ఓ చిత్రం చేస్తోంది. కాగా, ఇప్పుడామె వద్దకు మరో కథ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మూన్ షైన్ పిక్చర్స్ పతాకంపై ఓ చిత్రం నిర్మితం కానుంది. కొత్త దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం కథానాయికగా సంయుక్తా మేనన్ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. చిత్ర బృందం ఇప్పటికే సంయుక్తతో చర్చలు ప్రారంభించిందని.. దీనిపై ఆమె సానుకూలంగా ఉందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక
డెడ్లైన్స్ గ్లోబల్ డిస్రప్టర్స్ అనే హాలీవుడ్ మ్యాగజైన్ ప్రతీ ఏడాది.. ప్రపంచవ్యాప్తంగా వినోదరంగంలో రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ ఏడాది జాబితాలో ప్రముఖ బాలీవుడ్ అగ్రతార దీపికా పదుకొణె చోటు దక్కించుకుంది. -
పేరు అదేనా?
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందనున్న సినిమాపై ఈ నెల 20న మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజైన ఆ రోజున చిత్రబృందం అధికారికంగా సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని కానీ... పేరుని కానీ వెల్లడించే అవకాశాలున్నాయి. -
సూర్యకు జోడీగా పూజ?
సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 2డి ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూన్ తొలి వారం నుంచి అండమాన్ దీవుల్లో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. -
‘ధురంధర్’.. గ్యాంగ్స్టర్
సంగ్రామ్ భలేరావ్గా ‘సింగమ్ అగైన్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రణ్వీర్ సింగ్. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రానున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. రణ్వీర్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. -
ప్రేమ యుద్ధానికి సన్నాహాలు
‘బ్రహ్మాస్త్ర’లో జోడీగా ఆకట్టుకున్నారు బాలీవుడ్ యువజంట రణ్బీర్ కపూర్, అలియా భట్. ఇప్పుడు మరోసారి ‘లవ్ అండ్ వార్’ సినిమాతో అభిమానులను ప్రేమలో పడేయడానికి ముస్తాబవుతోందీ జంట. -
అందర్నీ అలరించే యాక్షన్ చిత్రమిది
శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి నాయకానాయికలుగా ఆడారి మూర్తి సాయి తెరకెక్కించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. జి.ఎస్.బాబు నిర్మించారు. సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘మనం’ ప్రత్యేక ప్రదర్శనలు
మూడు తరాల కథానాయకులు కలిసి చేసిన సినిమాగా... ఏఎన్నార్ చివరి చిత్రంగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ‘మనం’. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలై ఈ నెల 23తో పదేళ్లు పూర్తవుతున్నాయి. -
‘కన్నప్ప’లో కాజల్
విష్ణు మంచు కలల చిత్రం ‘కన్నప్ప’కి మరో ఆకర్షణ తోడైంది. ప్రముఖ కథానాయిక కాజల్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆ విషయాన్ని చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్కుమార్, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఫ్రెంచ్ దర్శకురాలి చిత్రంలో జాకీ ష్రాఫ్
ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్.. ఇప్పుడు ఓ సరికొత్త సినిమా కోసం అంతర్జాతీయ దర్శకురాలితో చేతులు కలిపారు. నటిగా, దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాండ్రిన్ బొన్నైర్ తెరకెక్కిస్తున్న ‘స్లో జో’ అనే చిత్రంలో జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
‘బుజ్జి’ని పరిచయం చేయబోతున్నానంటూ మరో పోస్ట్ పెట్టారు ప్రభాస్.