అలా ‘కొదమ సింహం’లో మోహన్బాబును క్లైమాక్స్ వరకూ పొడిగించాం!
ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే.. కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి తీసిన సత్యానంద్, మురళీ మోహన్ గారి అబ్బాయి సత్యానంద్ని థియేటర్లో చూశాను. అలాంటి సత్యానంద్తో అలాంటి క్షణక్షణం.. థియేటర్లుల్లో ఆడకపోయినా.
చెప్పింది వింటారే తప్ప ఎక్కువ మాట్లాడరు
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో యూట్యూబ్ వేదికగా తన అనుభవాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల రచయిత సత్యానంద్తో ఆయన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
సౌమ్యుడు, మితభాషి.. సత్యానంద్
‘‘సత్యానంద్, జంధ్యాల ఇద్దరూ కలిసి పనిచేశారని గతంలో మీకు చెప్పాను. ఇండస్ట్రీకి రాకముందే ఆయన ‘మాయదారి మల్లిగాడు’, ‘కిరాయి కోటిగాడు’ చూశాను. నా జీవితంలో.. నేను సినిమా రచయిత కావాలని 1975 డిసెంబర్ 23న హైదరాబాద్కి వచ్చా. రాఘవేంద్రరావు గారి ‘జ్యోతి’ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇక్కడికి వచ్చా. దాని రచయిత సత్యానంద్. కానీ, షూటింగ్ ప్రదేశంలో సత్యానంద్ లేరు. ఆయన చాలా బిజీ. సెట్స్లో కనిపించేవారు కాదు. అలా కుదరక మళ్లీ వెళ్లిపోయాను. 1979లో ఎంట్రీ, 80లో ఎన్టీఆర్ నన్ను గుర్తించారు. అలా ఐదారు సంవత్సరాలు పట్టింది మేము రచయితలు అవ్వడానికి. అలా వచ్చాక.. మద్రాస్లో ఉన్నా కూడా.. కేవలం ఫంక్షన్లప్పుడు మాత్రమే నటులు, దర్శకులు, రచయితలు కలుస్తుండేవారు. ఆ సినిమాకి రచయిత కాకపోయినా పిలుస్తుండేవారు. ఎందుకంటే హీరో చేసే చిత్రాలన్నీ ఒకే రచయిత రాయరు. నలుగురైదురు రాస్తారు. హీరో తరఫు పీఏలు రచయితలను పిలిచేవారు. అలావారిని ఒకట్రెండు సార్లు కలిశాను. అలా సత్యానంద్ గారిని కలిసినప్పుడు ఏమర్థమైందంటే.. సత్యానంద్ సౌమ్యుడు, మితభాషి. సామాన్యంగా సినిమా రచయితలు నేను, పోసాని కానీ ఎక్కువగా మాట్లాడుతుంటాం. ఇతను ఆత్రేయ స్టైల్. ఆత్రేయలాగా మౌనంగా ఉండేవారు. మనం మాట్లాడుతుంటే వింటారే తప్ప సమాధానం చెప్పరు. ఆయన సమాధానం కోసం మనం వేచి చూడాలి. సాధారణంగా ఆత్రేయ గారు సీన్ రాస్తే వెంటనే ఇవ్వమని అడగరు. ఇంకో వెర్షన్ రాసివ్వమంటారు. షూటింగ్ ముందు ఇవ్వండి అదే తీస్తారు. కేవలం దర్శకులకు మాత్రమే తెలుసా.. రచయితలకు తెలియదా ఎలా తీస్తారో అని అంటుండేవారు.
వికీపిడియాలో తప్పు చూపిస్తుంది
సత్యానంద్ గారు మాతో పాటు సమానంగా, లేదంటే ఎక్కువగా రాసే ఉంటారు. కానీ విచిత్రం ఏమిటంటే వికీలో మాత్రం 15 సినిమాలు మించి కనపడటం లేదు. కానీ మేము సినిమాకు కథ రాశామా, మాటలు రాశామా, స్ర్కీన్ప్లే రాశామా.. ఇలా ఆధారాలు ఉన్నాయి. కానీ సత్యానంద్ వికీలో మాత్రం ఆయన పూర్తి చిత్రాల జాబితా కనిపించలేదు. ఇదే విషయాన్ని మొన్న ఆయన్ను అడిగినా కూడా ‘ఫర్వాలేదు సోదరా’ అని అన్నారు. మా అన్నయ్య పిలుస్తారు గోపాలకృష్ణా అని.. మళ్లీ సత్యానంద్ గారు పిలుస్తారు అలాగే. అప్పుడప్పుడు సోదరా అంటారు. మా రచయితల సంఘానికి అనేక పర్యాయాలు ఆయన్ని అధ్యక్షుడిని చేయాలని చూశాను. ‘వద్దు సోదరా. దానికి చాలా కావాలి. ఆ దివ్యశక్తులన్నీ నీ దగ్గర ఉన్నాయి. అందరినీ ఒప్పించడం, నొప్పించకుండా ఒప్పించడం ఈ శక్తులు అన్ని నీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఎలాగో కొనసాగుతున్నావ్ కదా’ అంటుండేవారు. ఆయన గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకోగలిగానే తప్ప.. అధ్యక్షుడిగా మాత్రం తీసుకురాలేకపోయాను.
కథను నమ్మారు కాబట్టే.. కొదమ సింహం గెలిచింది
‘కొదమ సింహం’ చిత్రానికి మేము కలిసి పనిచేశాం. మురళీమోహన్ దర్శకత్వంలో వచ్చిందా చిత్రం. దానికి కథా మాటలు సత్యానంద్ గారు అందిస్తే.. స్ర్కీన్ప్లే మేము రాశాం. చిరంజీవి గారు సడెన్గా ఒకసారి ఫోన్ చేసి ‘వీజీపీకి వస్తారా’ అన్నారు. వెళ్తే ‘ఏమీ లేదు కథ బాగుంది. ఎక్కడో తప్పుంది అర్థం కావడంలేదు. దీన్ని మీరు చెబితే చాలు. కేవలం ఒక అభిప్రాయం కోసం మాత్రమే’ అని అన్నారు. సరిగ్గా ఇంటర్వెల్ అయ్యింది. అందులో సుడిగాలి పాత్ర మోహన్బాబు పోషించారు. మా అమ్మానాన్న ఎక్కడున్నారని చిరంజీవి మోహన్బాబుని కొడుతుంటే.. మోహన్బాబు పాత్ర ‘నాకు తెలుసు కానీ చెప్పను. ఎందుకంటే తెలిసిన తర్వాత నన్ను చంపేస్తావు’ అని ఆయన నవ్వుతారు. ఆయనతో పాటు అందరూ నవ్వుతున్నారు. ‘సినిమాలో ఉన్న తప్పు ఇదే’ అని చిరు అన్నారు. అదేంటి అన్నాను. ‘ఇంత అద్భుతమైన పాత్రని ఇక్కడితో ముగించకూడదు. అతడు చెప్పింది నిజమో అబద్ధమో తెలియాలి. అంటే అతడు బతికుండాలి’ అని అన్నారు చిరంజీవి. ‘దీనికి మీరు స్ర్కీన్ప్లే సమకూర్చాలి. ఆ పాత్ర బతికుంటే సెకెండ్ హాఫ్లో ఆర్డర్ మారిపోతుందని కాబట్టి మీరు స్ర్కీన్ప్లే చూడాలి’ అన్నారు. కొదమ సింహం చిత్రం ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. మోహన్ బాబు గారి పాత్రను ఆఖరికి కూడా చంపలేదు. క్లైమాక్స్లో మెడ మీద కాడి వేసుకొని గానుగా తిప్పుతూ ఉంటారు. జనమంతా నవ్వుకుంటూ బయటికి వచ్చారు. కథలో చిన్న దోషం ఉంటే మన కొంపలు ముంచేస్తాయి. కాబట్టి కథే ప్రాణం. కొదమ సింహంలో సుడిగాలి పాత్ర బతికింది కాబట్టి ఆ కథ అక్కడా బతికింది. ఇదే విషయాన్ని చిరంజీవి, సత్యానంద్ విశ్వసించారు కాబట్టి న్యాయం జరిగింది.
అదీ గొప్ప సహాయమే..
మేము ఎలా కొదమసింహానికి అభిప్రాయం చెప్పామో ఆయన కూడా ఈ మధ్య కొన్ని సినిమాల కథలు విని అభిప్రాయం చెప్పిన విషయాన్ని థ్యాంక్స్ కార్డ్లో వేస్తున్నారు. అది కూడా గొప్ప సహాయమే. ‘నారప్ప’లో కూడా థాంక్స్ కార్డ్లో సత్యానంద్ గారి పేరు కనపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
Gurucharan Singh: బాలీవుడ్లో ప్రముఖ టీవీ నటుడు ఐదు రోజులుగా కన్పించకుండా పోవడం చర్చనీయాంశమైంది. అతడిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం