PAYAL Rajput కన్నీటి పర్యంతం

‘ఆర్‌ఎక్స్‌ 100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయంటూ నటి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇకపై మీరు నా పక్కన ఉండకపోవచ్చు కానీ నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు.....

Published : 16 May 2021 00:33 IST

ప్రియమైన వ్యక్తిని కోల్పోయానంటూ పోస్ట్

హైదరాబాద్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇకపై మీరు నా పక్కన ఉండకపోవచ్చు. కానీ నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు. కరోనా నుంచి కోలుకునేందుకు మీరు ఎంతో పోరాడారు. కానీ మీ లాంటి వ్యక్తిని మేము కోల్పోయాం. మిమ్మల్ని మేము ఎంతో మిస్‌ అవుతున్నాం అనితా ఆంటీ. మా అమ్మలానే మీరు కూడా నాపై ప్రేమ చూపించేవారు. నన్ను గారాబం చేసేవారు. ఇప్పటికీ నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మిమ్మల్ని మరలా వెనక్కి తీసుకురావాలని ఉంది. కానీ అందుకు అవకాశం లేదు కదా!! అనితా ఆంటీ చివరిగా చెప్పిన మాట.. ‘నాకు ఊపిరాడడం లేదు’. కరోనా.. అవకాశం ఉంటే నిన్ను అంతం చేసేస్తా’’ అని పాయల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని