Dhanush to Vishal: ధనుష్‌ టు విశాల్.. స్టార్‌ హీరోలకు నిర్మాతల మండలి షాక్‌

తమిళనాడు చిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు స్టార్‌ హీరోలకు అక్కడి నిర్మాతల మండలి షాక్‌ ఇచ్చింది. 

Published : 14 Sep 2023 15:31 IST

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌ హీరోలకు తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి షాక్‌ ఇచ్చింది. ధనుష్‌, విశాల్‌, అథర్వ, శింబులకు రెడ్‌ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం జరిగిన సర్వసభ్య సమావేశంలో తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

కాగా, నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో శింబు(Simbu)కు రెడ్‌ కార్డు జారీ చేయనుంది. ఈ వివాదంపై ఇప్పటికే ఎన్నోసార్లు చర్చలు జరిపినా శింబు నుంచి ఎలాంటి మార్పు రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రొడ్యూసర్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో అసోసియేషన్‌ నిధులను విశాల్‌ (Vishal) దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆయనకు రెడ్‌ కార్డు ఇవ్వనున్నారు. తెనందాల్‌ నిర్మాణ సంస్థలో ధనుష్‌ (Dhanush) ఓ చిత్రానికి అంగీకరించారని.. 80 శాతం షూట్‌ పూర్తయ్యాక.. చిత్రీకరణ విషయంలో ఆయన ఆసక్తి కనబరచలేదని.. దాని వల్ల నిర్మాతకు నష్టాలు ఏర్పడినట్లు మండలి తెలిపింది. ఈ కారణంతోనే ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. మదియలకన్‌ నిర్మాణ సంస్థతో అథర్వ (Atharva) ఓ చిత్రానికి ఓకే చేశారని.. కాకపోతే షూటింగ్‌ విషయంలో ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదనే ఆరోపణలతో అథర్వకు రెడ్‌ కార్డు ఇవ్వనున్నట్లు చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని