Dhanush: రీ రిలీజ్‌లోనూ ‘రఘువరన్’ జోష్‌.. సందడిగా థియేటర్లు

ధనుష్ హీరోగా రూపొందిన సినిమా ‘రఘువరన్ బి.టెక్’ (Raghuvaran BTech). తాజాగా దీన్ని రీ రిలీజ్ చేయగా థియేటర్లు సందడిగా మారాయి.

Published : 19 Aug 2023 13:13 IST

హైదరాబాద్‌: ధనుష్‌ (Dhanush) హీరోగా 2015లో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా ‘రఘువరన్ బి.టెక్’ (Raghuvaran BTech). యూత్‌ను ఎంతో ఆకట్టుకున్న ఈ చిత్రం రీ రిలీజై మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది.

తమిళంలో ‘వెలైలా పట్టాధారి’ పేరుతో వచ్చిన చిత్రాన్ని తెలుగులో ‘రఘువరన్ బి.టెక్‌’గా విడుదల చేశారు. ఈ మూవీతోనే తెలుగులోనూ ధనుష్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్ పెరిగింది. అలాగే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న అనిరుధ్‌ రవిచందర్‌ తన కెరీర్‌ ప్రారంభంలో ఈ సినిమాకు సంగీతం అందించారు. నిరుద్యోగుల కష్టాలు, మధ్య తరగతి కుటుంబంలోని అనుబంధాలు ఇందులో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా అమ్మ సెంటిమెంట్‌ సాంగ్ అందరినీ మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

రివ్యూ: గన్స్‌ అండ్‌ గులాబ్స్‌

ఇక ఎనిమిదేళ్ల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 100కు పైగా థియేటర్లలో ‘రఘువరన్ బి.టెక్’ను రీ రిలీజ్ చేశారు. బుకింగ్స్ ఓపెన్‌ చేయగానే హౌస్‌ ఫుల్‌ అయినట్లు నిర్మాత స్రవంతి రవికిశోర్‌ చెప్పారు. ‘‘కొన్ని సినిమాలు ఎవర్‌ గ్రీన్‌గా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘రఘువరన్ బి.టెక్’ ఒకటి. ప్రతి తరంలోని విద్యార్థులకు ఈ సినిమా కనెక్ట్‌ అవుతుంది’’ అని చెప్పారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని