రాజశేఖర్‌ ఆరోగ్యం మెరుగైంది: జీవిత

కరోనా బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్న నటుడు రాజశేఖర్‌ కోలుకుంటున్నారని ఆయన భార్య జీవిత వెల్లడించారు. ఆయన ఆరోగ్యం మెరుగయ్యిందని ఓ వీడియోలో పేర్కొన్నారు...

Updated : 04 Nov 2020 10:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్న నటుడు రాజశేఖర్‌ కోలుకుంటున్నారని ఆయన భార్య జీవిత వెల్లడించారు. ఆయన ఆరోగ్యం మెరుగయ్యిందని ఓ వీడియోలో పేర్కొన్నారు. సీఎన్‌సీ ఆసుపత్రి వైద్యులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అయితే రాజశేఖర్‌ వెంటిలేటర్‌ మీద ఉన్నారనే వార్తలను జీవిత కొట్టివేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆయనకు ఎప్పుడూ వెంటిలేటర్‌ మీద చికిత్స అందించలేదని, ఆ వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. ఐసీయూలోనే ఆక్సీజన్‌ అందిస్తూ చికిత్స చేశారని వివరించారు. త్వరలోనే ఐసీయూ నుంచి బయటకొచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. రాజశేఖర్‌ కోలుకోవాలని మిత్రులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు చేసిన ప్రార్థనలే ఆయనను కోలుకునేలా చేశాయని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని