RamCharan: జవాన్లతో రామ్‌చరణ్‌

శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం కోసం కొన్నాళ్లుగా అమృత్‌సర్‌లో ఉన్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. అక్కడే కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరిసున్నారు. మంగళవారం షూటింగ్‌ విరామంలో

Updated : 20 Apr 2022 14:10 IST

శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం కోసం కొన్నాళ్లుగా అమృత్‌సర్‌లో ఉన్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. అక్కడే కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరిసున్నారు. మంగళవారం షూటింగ్‌ విరామంలో ఆయన కొంత సమయం బీఎస్‌ఎఫ్‌ జవాన్లతో గడిపారు. ఈ విషయాన్ని తను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘‘ఖాసా అమృత్‌సర్‌లోని సరిహద్దు భద్రతా దళం క్యాంప్‌లో సైనికుల కథలు, త్యాగాలు, వాళ్ల అంకిత భావం గురించి వింటూ స్ఫూర్తిదాయకమైన మధ్యాహ్నం గడిపా’’ అంటూ జవాన్లతో కలిసి దిగిన కొన్ని ఫొటోల్ని పంచుకున్నారు. శంకర్‌ - రామ్‌చరణ్‌ కలయికలో రూపొందుతున్న ఈ సినిమాలో కథానాయికగా కియారా అడ్వాణీ నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని