అన్నీ సెటిల్‌.. ‘సత్తిగాని రెండెకరాలు’ విడుదలకు సిద్ధం.. ఏ ఓటీటీలో అంటే?

జగదీష్ ప్రతాప్‌ బండారి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సత్తిగాని రెండెకరాలు’ త్వరలోనే విడుదల కానుంది. ఏ ఓటీటీలో? ఎప్పుడంటే?

Published : 02 May 2023 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పుష్ప’ (Pushpa) ఫేమ్‌ (కేశవ పాత్ర పోషించిన నటుడు) జగదీష్‌ ప్రతాప్‌ బండారి (Jagadeesh Prathap Bandari) ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’ (Sathi Gani Rendu Ekaralu). వెన్నెల కిశోర్‌, అనీషా, మోహన శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభినవ్‌ దండ దర్శకత్వం వహించారు. నేరుగా ఓటీటీ ‘ఆహా’ (aha)లో ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ఖరారు చేసింది. మే 26 నుంచి ఈ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ విడుదల చేసింది. ‘‘సత్తి ముందు జెప్పిన రోజు రాలే.. వాని రెండెకరాల భూమి చిక్కుల్ల పడిండే.. ఇగ అన్నీ సెటిల్‌ అయినయ్‌. మే 26న ముహూర్తం పెట్టినం. అస్తుండు, ఆగమాగం జేయనీకి’’ అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ పెట్టింది. భూ సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందినట్టు అర్థమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు