Shivani Rajasekhar: ‘మిస్‌ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్‌.. కారణమిదే

మరికొన్ని రోజుల్లో ‘మిస్‌ ఇండియా’  పోటీల్లో పాల్గొనాల్సిన ప్రముఖ హీరో రాజశేఖర్‌ తనయ, నటి శివాని తప్పుకున్నారు.

Published : 30 Jun 2022 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని రోజుల్లో ‘మిస్‌ ఇండియా’ (Miss India) పోటీల్లో పాల్గొనాల్సిన ప్రముఖ హీరో రాజశేఖర్‌ తనయ, నటి శివాని (Shivani Rajasekhar) తప్పుకున్నారు. అందాల కాంటెస్ట్‌ నుంచి తాను తప్పుకున్నట్టు సోషల్‌ వేదికగా తెలియజేశారు. ‘‘నాకు పరీక్షలు (మెడికల్‌ థియరీ) ఉండటంతో పాటు, మలేరియా రావడం వల్ల ట్రైనింగ్, గ్రూమింగ్ సెషన్స్, సబ్ కాంటెస్ట్‌ల్లో పాల్గొన లేకపోయా. అయినా మునుపటిలానే ప్రయత్నించాలనుకున్నా. కానీ, అది సాధ్యపడలేదు. నా ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ అనుకున్న తేదీ కంటే ముందుగానే మొదలయ్యాయి (బుధవారం నుంచి). అంతేకాదు ‘మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఫినాలే’ రోజైన జులై 3న నాకు ఎగ్జామ్‌ ఉంది. దాంతో మిస్‌ ఇండియా ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నా’’ అని శివానీ భావోద్వేగ లేఖ రాశారు. ఇప్పటి వరకూ తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పోటీల్లో ఆమె తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం అందుకున్నారు. ఇప్పుడిలా అనూహ్య ప్రకటన చేశారు. దాంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆమె బంగారు భవిష్యత్తుకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘అద్భుతం’ చిత్రంతో నటిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివాని ఆ తర్వాత ‘WWW’, ‘శేఖర్‌’ సినిమాలతో అలరించారు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు, తెలుగులో ‘అహ నా పెళ్లంట’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని