MAA Elections: సీసీ ఫుటేజ్‌ కోరిన ప్రకాశ్‌రాజ్‌.. ఎన్నికల అధికారికి లేఖ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ని ప్రకాశ్‌రాజ్‌ కోరారు.

Updated : 14 Oct 2021 17:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ని ప్రకాశ్‌రాజ్‌ కోరారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. ‘మా ఎన్నికలు నిర్వహించిన రోజు ఎన్నో భయంకర ఘటనలు జరిగాయి. దానికి మీరే సాక్షి. మోహన్‌ బాబు, నరేశ్‌ ప్రవర్తన ఎలా ఉందో చూశాం. కొందరు ‘మా’ సభ్యులపై వారు దాడి చేశారు. దానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ లీక్‌ అయ్యాయి. ‘మా’ సభ్యులు నిజం ఏంటో, పోలింగ్‌ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. పోలింగ్‌ సమయంలో సీసీ కెమెరాల గురించి మీరు వివరించారు. అన్నింటినీ మీరు రికార్డు చేసుంటారని భావిస్తున్నా. దాన్ని మాకు అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నా. మీరు వెంటనే స్పందించకపోతే అది డిలిట్‌ అయ్యే అవకాశాలున్నాయి’ అని పేర్కొన్నారు.

సీసీ ఫుటేజ్‌ భద్రంగానే ఉంది: కృష్ణ మోహన్

ప్రకాశ్‌రాజ్‌ రాసిన లేఖపై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ స్పందించారు. ఎన్నికలకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ భద్రంగానే ఉందని తెలిపారు. నిబంధనల ప్రకారం ఫుటేజ్‌ని ఇస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని