Rajasekhar: పండగ వేళ నటుడు రాజశేఖర్‌ ఇంట విషాదం

నటుడు రాజశేఖర్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) మరణించారు.

Updated : 05 Nov 2021 06:38 IST

హైదరాబాద్‌: దీపావళి పండగ వేళ సినీ నటుడు రాజశేఖర్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) మరణించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. వరదరాజన్‌ చెన్నై డీసీపీగా చేసి రిటైర్‌ అయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. రాజశేఖర్‌ ఆయనకు రెండో సంతానం. వరదరాజన్‌ భౌతికకాయాన్ని నేడు చెన్నై తీసుకెళ్లనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని