Aarya: తండ్రి అయిన ఆర్య.. హీరో ఇంట డబుల్‌ ధమాకా

కోలీవుడ్‌ నటుడు ఆర్య తండ్రయ్యారు. తాజాగా ఆయన సతీమణి, నటి సాయేషా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నటుడు విశాల్‌ శుక్రవారం రాత్రి ఓ ట్వీట్‌ చేశారు.....

Published : 24 Jul 2021 12:39 IST

చెన్నై‌: కోలీవుడ్‌ నటుడు ఆర్య తండ్రయ్యారు. ఆయన సతీమణి, నటి సాయేషా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నటుడు విశాల్‌ శుక్రవారం రాత్రి ఓ ట్వీట్‌ చేశారు. ‘నా సోదరుడు ఆర్య తండ్రి అయ్యాడనే శుభవార్త చెప్పడం నాకెంతో ఆనందంగా ఉంది. పండంటి పాపకు సాయేషా జన్మనిచ్చింది. నేను బాబాయ్‌ని అయ్యాను. షూటింగ్‌ మధ్యలో ఉన్న నేను.. సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను. వాళ్లకి అంతా మంచే జరగాలని.. ఆ పాపకు దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని విశాల్‌ ట్వీట్‌ చేశారు.

‘అఖిల్‌’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సాయేషాని ఆర్య ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ‘నేనే అంబానీ’, ‘రాజా రాణి’లతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ఆర్య.. ‘సైజ్‌ జీరో’, ‘వరుడు’ వంటి డైరెక్ట్‌ తెలుగు చిత్రాల్లోనూ కీలకపాత్రలు పోషించారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘సార్పట్ట’ చిత్రం ఓటీటీ వేదికగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆయన ఇంట డబుల్‌ ధమాకా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని