Allu Arjun: అల్లు అర్జున్‌.. ఆపన్న హస్తం

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చిన వరదల వల్ల పలు జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఒకొక్కరిగా ముందుకొస్తున్నారు.

Updated : 03 Dec 2021 09:36 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చిన వరదల వల్ల పలు జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఒకొక్కరిగా ముందుకొస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు విరాళం అందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్‌, మహేష్‌బాబు తదితరులు తమ సాయాన్ని ప్రకటించగా గురువారం హీరో అల్లు అర్జున్‌ తన వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన ఏపీ ప్రజలను ఆదుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25లక్షలు విరాళమిస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. వరద బాధిత జిల్లాలు త్వరితగతిన సాధారణ స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని