Ninne Pelladata: ఎవర్గ్రీన్ మూవీ ‘నిన్నే పెళ్లాడతా’కు 25ఏళ్లు
Ninne Pelladata: నాగార్జున, టబు కీలక పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం 25ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఇంటర్నెట్డెస్క్: కృష్ణవంశీ మొదటి సినిమా గులాబీ సూపర్హిట్. చిత్రపరిశ్రమలో ఎటు చూసినా ప్రశంసల వెల్లువ. కానీ ఆ ప్రశంసల్లో ‘అచ్చం మీ గురువు ఆర్జీవీలా తీశారు’ అని ప్రశంసే ఆయన్ను ఆలోచనలో పడేసింది. ఆ ముద్రను చెరిపేయడానికి తనదైన ముద్ర వేయడానికి తీసిన సినిమానే ‘నిన్నేపెళ్లాడతా’. తెలుగులోనే ఎవర్గ్రీన్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచిపోయిందీ చిత్రం. ఈ సూపర్హిట్ ఫిల్మ్ విడుదలై(అక్టోబరు 4) నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
వైవిధ్యమైన కథలు ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించడంలో అక్కినేని నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ‘శివ’లాంటి క్రైమ్ డ్రామాను అందించి తెలుగు చిత్రసీమను ఆలోచనలో పడేసిన హీరో ఆయన. క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో హిట్టు కొట్టి మరోసారి కొత్త ఒరవడి సృష్టించాడు. అదే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిన్నే పెళ్లాడతా’. నాగార్జున-టబుల కెమెస్ట్రీ, కృష్ణవంశీ టేకింగ్, సందీప్ చౌతా సంగీతం సినిమాను విజయ పథంలో నడిపాయి. ఇందులో నటించిన ప్రతి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి క్లాసిక్ చిత్రం ఎలా పట్టాలెక్కిందంటే..
నాగార్జునతో యాక్షన్ మూవీ చేద్దామనుకుని..
కృష్ణవంశీ అప్పటికే దర్శకుడు రామ్గోపాల్వర్మ దగ్గర శిష్యుడిగా చేస్తున్నారు. ‘అనగనగా ఒకరోజు’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించినా బడ్జెట్ దాటిపోతుండటంతో అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే, కృష్ణవంశీ ప్రతిభ తెలిసిన వర్మ ‘గులాబీ’తో మరో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా పాటల చిత్రీకరణ చూసిన నాగార్జున ఒక రోజు కృష్ణవంశీని పిలిచి ‘నాతో సినిమా చేస్తావా’ అని అడిగారు. ‘మీరు నాతో చేస్తారా’ అని కృష్ణవంశీ బదులిచ్చారట. ఆ తర్వాత కొన్ని రోజులకు ఓ మంచి యాక్షన్ కథను నాగార్జునకు వినిపించారు కృష్ణవంశీ. నాగ్కు కూడా అది నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. ఇక లొకేషన్స్ చూడటానికి విశాఖ వెళ్లగా, అక్కడ కృష్ణవంశీని గుర్తుపట్టిన ఓ వ్యక్తి ‘గులాబీ సినిమా రామ్గోపాల్వర్మలా బాగా తీశారు’ అని అన్నాడట. ఆ మాటలు కృష్ణవంశీని ఆలోచనలో పడేశాయి. ‘రాముడొచ్చాడు’ షూటింగ్లో ఉన్న నాగార్జునకు ఫోన్ చేసి ‘సర్ నేను మీకు చెప్పిన కథతో సినిమా చేయను. మరో కథ చెబుతా’ అని అన్నారట. ‘నీకేమైనా పిచ్చా’ అంటూ నాగార్జున అసహనం వ్యక్తం చేయగా, మరుసటి రోజు హైదరాబాద్ వచ్చి నాగార్జునకు ‘నిన్నే పెళ్లాడతా’ పాయింట్ వినిపించారు. అప్పట్లో బాలీవుడ్లో ‘హమ్ ఆప్ హై కౌన్’, ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రాలు ఓ ట్రెండ్ సృష్టించాయి. వాటి ఆత్మను తీసుకుని తెలుగుదనం, కుటుంబ అనుబంధాలకు దగ్గరగా కథ రాసుకున్నారు. అది ఆయనకు కూడా నచ్చడంతో పది రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేశారు. అది నాగార్జునకు వినిపిస్తే, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కథానాయిక ఎవరు?
నాగార్జున కథ ఓకే చేశారు. మరి హీరోయిన్ ఎవరు? కథానాయిక కోసం ముంబయి, మద్రాసుల్లో ఆడిషన్ నిర్వహించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 65మందిని ఆ పాత్ర కోసం పరిశీలించారు. అలా ఒకరోజు హీరోయిన్ కోసం వెతుకుతుండగా, టబు గుర్తొచ్చారు. ఎలాగో ఆమె అడ్రస్ కనుక్కొని కృష్ణవంశీ ముంబయి వెళ్లారు. అయితే ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా రోడ్డుపైనే టబుకు కథ చెప్పాల్సి వచ్చింది. సినిమా థీమ్ ఆమెకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. ఆ తర్వాత మద్రాసు వెళ్లి పూర్తి కథను టబుకు వినిపించారు. అలా ‘నిన్నే పెళ్లాడతా’ పట్టాలెక్కింది. అన్నపూర్ణా బ్యానర్పై నాగార్జున స్వయంగా నిర్మించారు. సంగీత దర్శకుడిగా సందీప్ చౌతాను ఎంచుకున్నారు. ఆయనకు ఇదే తొలి చిత్రం.
ఇదీ కథ
శీను(నాగార్జున) ఉత్సాహం ఉరకలెత్తే యువకుడు. భయమన్నదే ఎరుగని నైజం. కుటుంబసభ్యులు, స్నేహితులతో జీవితాన్ని జాలీగా ఆస్వాదిస్తుంటాడు. వాళ్లింటి వాతావరణం ఎప్పుడూ సరదాగా, అమ్మానాన్న, బాబాయిలతో కళకళలాడుతూ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆనందం ఆ ఇంటి చిరునామా. మహాలక్ష్మి(లక్ష్మి)కి తన కుమారుడు శీను అంటే వల్లమాలిన ప్రేమ. ఆ ఇంటి పక్కనే మూర్తి(చంద్రమోహన్) కుటుంబం కూడా నివాసముంటుంది. రెండు కుటుంబాలు ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉంటాయి. ఇదే సమయంలో మహాలక్ష్మి(టబు) పైలెట్గా శిక్షణ తీసుకోడానికి హైదరాబాద్కు వస్తుంది. మూర్తి వాళ్ల ఇంట్లో ఉండి శిక్షణ తీసుకునేందుకు వచ్చిన టబుకి అక్కడి వాతావరణం బాగా నచ్చుతుంది. అన్నింటికన్నా ఎక్కువగా శీను నచ్చుతాడు. ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. శీను కుటుంబానికి కూడా పండు నచ్చడంతో పెళ్లికి అంగీకరిస్తారు. అయితే ఆ పండు ఎవరో కాదు. పెళ్లిరోజే ఇంట్లోంచి పారిపోయిన శీను సొంత మేనత్త కూతరు. ఈ నిజం తెలిసిన తర్వాత శీను కుటుంబం ఎలా స్పందించింది? కుటుంబ గొడవల మధ్య శీను, పండు ప్రేమ ఎటు దారితీసింది? చివరకు వాళ్లిద్దరూ ఒక్కటయ్యారా?లేదా? అనేది మిగతా కథ.
నాగ్,టబుల కెమిస్ట్రీ అదిరిపోయింది
ఇప్పటికి వచ్చిన ప్రేమకథల్లో ‘నిన్నేపెళ్లాడతా’ ఎవర్గ్రీన్గా నిలిచిపోయింది. శీను, పండుల జంట కూడా అంతగానే హిట్ అయింది. నాగ్ ఈ సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. గ్రీకు వీరుడు పాట అదే స్థాయి విజయాన్ని అందుకుంది. టబు తన అందచందాలతో యువతను కట్టిపడేసింది. ప్రతి ఫ్రేమ్లోనూ ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అప్పటిదాకా కరుడుగట్టిన విలన్పాత్రలు వేస్తూ వచ్చిన చలపతిరావు ఇందులో నాగార్జునకు తండ్రిగా చేశారు. తల్లిగా లక్ష్మి ఒదిగిపోయారు. బ్రహ్మాజీ, చంద్రమోహన్, ఉత్తేజ్ల మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెడతాయి. సినిమా ఆరంభంలో వచ్చే బైక్ రేసింగ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత నాగార్జున ‘అన్నమయ్య’లో నటించడం విశేషం.
ఎవర్గ్రీన్ సాంగ్స్
‘నిన్నే పెళ్లాడతా’ చిత్రానికి సందీప్ చౌతా అందించిన పాటలు కూడా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ పాట ఆల్టైమ్ సూపర్హిట్గా నిలిచింది. ఇక ‘గ్రీకువీరుడు’పాట కొన్నాళ్లపాటు అమ్మాయిలు హమ్ చేస్తూనే ఉన్నారు. ఇందులో ఏడు పాటలు ఉండగా, ఆరు పాటలు సిరి వెన్నెల కలం నుంచి జాలు వారాయి. ‘నా మొగుడు..’పాటను సుద్దాల అశోక్ తేజ రాశారు. ఆ కాలానికి చాలా అడ్వాన్స్గా తీసిన సినిమా ఇది. టెలిఫోన్ ద్వారా నాగ్, టబులు వీడియో కాల్ మాట్లాడుకుంటారు. బంధాలు, అనుబంధాలు గురించి కృష్ణవంశీ సినిమాలో చూపించిన విధానానికి కుటుంబ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత సుమారు 15మంది నిర్మాతలు తమతో కూడా ఈ తరహా మూవీ తీయమని కృష్ణవంశీకి బ్లాంక్ చెక్కులు, భారీ రెమ్మునరేషన్స్ ఆఫర్ చేశారట.
‘నిన్నే పెళ్లాడతా’ గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలు..
* నాగార్జున కెరీర్లోనే మొదటి సిల్వర్ జూబ్లీ సినిమా ఇది!
* 39 సెంటర్స్లో 100 రోజులు, 4 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
* ఏడాది తర్వాత తమిళంలోనూ ‘ఉన్నైయే కల్యాణమ్ పన్నికిరెన్’గా అనువాదం చేస్తే అక్కడా విజయం సాధించింది.
* అప్పట్లో మొత్తం రూ.12కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.
* ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి అవార్డులను గెలుచుకోగా, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం అక్కినేని అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ నేపథ్య గాయకుడిగా రాజేశ్ కృష్ణన్(ఎటో వెళ్లిపోయింది మనసు) నంది అవార్డు అందుకున్నారు.
* ఉత్తమ జాతీయ చిత్రం(తెలుగు)గా ‘నిన్నే పెళ్లాడతా’ను అవార్డు వరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్