Pushpa: సుకుమార్ లేనిదే నేను లేను: అల్లు అర్జున్
‘‘వన్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షయేషన్’ అని ఇంగ్లీషులో ఒక నానుడి ఉంటుంది. ఓడలు ఏ దిశగా ప్రయాణం చేయాలనేది... ఓడలోని ఓ మీటర్ సూచిస్తుంటుంది. అక్కడ మీటర్లో ఒక డిగ్రీ కోణం మార్చి ప్రయాణం సాగిస్తే... మనం వేరే ఖండానికే వెళ్తాం.
‘‘వన్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షయేషన్’ అని ఇంగ్లీషులో ఒక నానుడి ఉంటుంది. ఓడలు ఏ దిశగా ప్రయాణం చేయాలనేది... ఓడలోని ఓ మీటర్ సూచిస్తుంటుంది. అక్కడ మీటర్లో ఒక డిగ్రీ కోణం మార్చి ప్రయాణం సాగిస్తే... మనం వేరే ఖండానికే వెళ్తాం. అదే ఆ ఒక్క డిగ్రీ మార్చకుండా వెళితే వేరే ఖండానికి చేరుకుంటాం. అలా దర్శకుడు సుకుమార్ నా జీవితంలో ఆ ఒక డిగ్రీ కోణంలాంటి వారు. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి కారణం ఆయనే. సుకుమార్ లేనిదే నేను లేను’’ అన్నారు కథానాయకుడు అల్లు అర్జున్. ఆయన నటించిన చిత్రం ‘పుష్ప’. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించాయి. డిసెంబర్ 17న పాన్ ఇండియా సినిమాగా విడుదలై... దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరా బాద్లో ‘థ్యాంక్స్ మీట్’ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఆర్య నుంచి పుష్ప దాకా నా ప్రయాణంలో వెన్నంటి ఉండి నడిపించిన సుకుమార్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి, అక్కడ విజయం రావడానికి కారణమైన ప్రతీ ఒక్కరికి ధన్య వాదాలు తెలియజేసుకుంటున్నా’’ అన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘‘నేను ‘పుష్ప’ను పూర్తిగా తెలుగు సినిమా అనుకునే తీశాను. అల్లు అర్జున్, నిర్మాతలు పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లి విజయవంతమయ్యారు. ఎంతో సంతోషంగా ఉంది. దీనికోసం ఎన్నో ప్రాంతాలు తిరిగి, ఎంతో మందిని కలిసి... పెద్ద పరిశోధన చేశాం. ‘పుష్ప-2.. ది రూల్’ తర్వాత ఎర్రచందనం నేపథ్యంలోనే వెబ్సిరీస్ చేయాలనుకుంటున్నాం. అల్లు అర్జున్ గురించి ఏం చెప్పాలి? నేను మునిగిపోతున్నప్పుడు నన్ను లాగి గట్టునవేశాడు. మా ఇద్దరి అనుబంధం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ప్రపంచంలోనే అద్భుతమైన ఆదరణ పొందుతున్న పాటలు ఇచ్చిన దేవీశ్రీప్రసాద్కు, సాహిత్యం అందించిన చంద్ర బోస్కు కృతజ్ఞతలు. తెలుగు చిత్ర పరిశ్రమలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తర్వాత ఆ స్థాయి ఎవరిది అని ఆలోచిస్తే..నాకు చంద్రబోసే కన్పించారు. ఈ సందర్భంగా గీత రచయిత చంద్రబోస్ను వేదిక మీదికి ఆహ్వానించి ఆయనలోని పాండిత్యానికి పాదాభివందనం చేశారు. యూనిట్లో బాగా కష్టపడి పనిచేసిన సెట్బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్కు ఒక్కొక్కరికీ రూ.లక్ష బహుమానంగా ఇస్తామని ప్రకటించారు. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ‘‘ఊ అంటారా.. మామ ఉఊ అంటారా’’ పాట యూట్యూబ్ గ్లోబ్ నంబర్ సాంగ్గా నిలవడం, 4, 54 స్థానాల్లోనూ ‘శ్రీవల్లీ..’ ‘స్వామిస్వామి’ పాటలు నిలవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం సుకుమార్, రచయిత చంద్రబోస్ వారికి నా కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఇంత మంచి పాటలు రాసే అవకాశాలిస్తున్న సుకుమార్, దేవీశ్రీప్రసాద్లకు ధన్యవాదాలు... మా స్నేహమే ఇంత గొప్ప పాటలు రావడానికి కారణం’’ అన్నారు చంద్రబోస్. నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లకు కృతజ్ఞతలు. తెలుగులో ఎంత ప్రేక్షకాదరణ పొందిందో... ఇతర భాషల్లోనూ అంతే ఆదరణతో నడుస్తోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రష్మిక, రవిశంకర్, సునీల్తో పాటు చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
ఇంటర్నెట్డెస్క్: 2024లో వరుస హిట్స్తో మలయాళ చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతోంది. కేవలం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన పలు చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్లోనూ చేరాయి. ఇప్పటివరకూ ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకున్న టాప్-5 మలయాళీ చిత్రాలేంటో చూసేయండి. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం.. -
నిజ జీవిత కథలంటే ప్రత్యేక బాధ్యత
కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్ బొల్లా. బొల్లాంట్ ఇండస్ట్రీస్ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్’ చిత్రం తెరకెక్కింది. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
నిజమైన బలం అదే
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత నిర్ణయించుకుందా? ఆమె ఇన్స్టాలో పంచుకున్న ఓ పోస్ట్ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది. -
రాయన్ వస్తున్నాడు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. -
ఓటీటీలోకి నేరుగా ‘విద్యా వాసుల అహం’
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. -
‘టైటానిక్’ కెప్టెన్ కన్నుమూత
‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. -
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షురూ
యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు ద్వయం రాజ్, డీకే ఈ వెబ్సిరీస్ రూపొందిస్తున్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు