Republic: కలెక్టర్‌గా సాయితేజ్‌.. ట్రైలర్‌ విడుదల చేసిన చిరంజీవి

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు నటుడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రిపబ్లిక్‌’...

Updated : 22 Sep 2021 13:13 IST

సాయితేజ్‌ ఆరోగ్యంపై చిరంజీవి ఏమన్నారంటే..

హైదరాబాద్‌: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు నటుడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈసినిమాలో సాయితేజ్‌ కలెక్టర్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. అక్టోబర్‌ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘రిపబ్లిక్‌’ ట్రైలర్‌ను బుధవారం ఉదయం చిరంజీవి విడుదల చేశారు. అవినీతి రాజకీయాల కారణంగా ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియజేసేలా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో కలెక్టర్‌ పాత్రలో సాయి చెప్పే డైలాగ్‌లు ఆలోచింపజేసేలా ఉన్నాయి.

‘సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు పట్టపగలే బాహటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే.. కంట్రోల్‌ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయ్‌’ అంటూ సాయి చెప్పే డైలాగ్‌లు మెప్పించేలా ఉన్నాయి. మరోవైపు రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

సాయి కోలుకుంటున్నాడు..

ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి స్పందించారు. ‘సాయిధరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1వ విడుదల చేస్తే బాగుంటుందన్న సాయి తేజ్‌ కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతోంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయిధరమ్‌కు శ్రీరామ రక్ష’ అని చిరు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని