థియేటర్లలో చూస్తేనే ఆ అనుభూతి
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్స్టోరీ’. నారాయణదాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మించారు.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్స్టోరీ’. నారాయణదాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సి.హెచ్ స్వరాలందించారు. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘శేఖర్ కమ్ముల శైలిలో సాగే ఓ అందమైన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందించాం. ఇందులో ప్రేమకథతో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటన్నది తెరపైనే చూడాలి. ఇలాంటి సినిమాలు థియేటర్లలో చూస్తేనే ఆ అనుభూతి తెలుస్తుంది. ఆంధ్రాలోని సమస్యలు ఈనెల 20కల్లా ఓ కొలిక్కి వచ్చినా రాకున్నా.. 24వ తేదీకి పక్కాగా విడుదల చేయాలని ముందే ఫిక్సయ్యాం. ప్రస్తుతం ఆంధ్రాలో నైట్ కర్ఫ్యూని దృష్టిలో పెట్టుకుని.. ఆటల టైమింగ్స్ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అక్కడా నాలుగు షోలు పడేలా ప్లాన్ చేసుకుంటున్నాం.
* శేఖర్ కమ్ములతో ధనుష్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాం. ఇందులో ఓ ప్రధాన పాత్ర కోసం మోహన్లాల్తో పాటు తెలుగు, హిందీ చిత్రసీమల నుంచి కొందరి పేర్లును పరిశీలిస్తున్నాం.
* నాగార్జునతో చేస్తున్న ‘ది గోస్ట్’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. నాగశౌర్యతో చేస్తున్న ‘లక్ష్య’ చిత్రాన్ని నవంబరులో విడుదల చేస్తాం. తర్వాత శివ కార్తికేయ, సుధీర్బాబులతో సినిమాలు చేస్తాం’’ అన్నారు.
ఆన్లైన్ టికెటింగ్తో నిర్మాతలకు మేలే
ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని మేము స్వాగతిస్తున్నామన్నారు నిర్మాతలు నారాయణ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు. దీనిపై వాళ్లు మాట్లాడుతూ ‘‘మంచి ఆలోచనే అది. దీనిపై 2018లోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున ప్రభుత్వానికి ఓ లేఖ రాశాం. ఆన్లైన్ టికెటింగ్ విధానం నిర్మాతలకు మేలు చేస్తుందని చెప్పాం. తెలంగాణలో నాలుగేళ్ల క్రితమే ఈ ఆన్లైన్ విధానం తీసుకురావాలని ప్రయత్నించారు. కొన్ని సమస్యల వల్ల అది కుదర్లేదు. అయినా ఇప్పటికే దేశవ్యాప్తంగా 80శాతం వరకు థియేటర్లలో ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ ఉంది. ఏపీలో థియేటర్ల టికెట్ ధరలు, బుకింగ్ విధానం, ఇతర విషయాలపై ప్రభుత్వంతో సంప్రదించేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కలవనున్నాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కొత్తదనం నిండిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
తెలుగు సినీ దర్శకుడు త్రినాథరావు ఇంట విషాదం
Director Trinadha Rao: దర్శకుడు త్రినాథరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి సోమవారం రాత్రి కన్నుమూశారు. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
నాగార్జునతో బాబీ దేవోల్ ఢీ!
‘కుబేర’ తర్వాత నాగార్జున చేయనున్న చిత్రంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆయన స్టూడియో గ్రీన్ పతాకంపై తమిళ దర్శకుడు నవీన్తో ఓ సినిమా చేయనున్నారు. -
మళ్లీ కలిసేనా?
‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా కనిపించి సినీప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె ‘పరదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. -
మరోసారి ఈ జోడీ?
నాగచైతన్య - పూజా హెగ్డే జోడీ మరోసారి తెరపై సందడి చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ‘తండేల్’ సినిమా చేస్తున్న చైతూ... తదుపరి కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. -
పేరు మరింత బాధ్యతని పెంచింది
పెళ్లికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాల్ని మా సినిమాతో చెబుతున్నాం. హాస్యంతోపాటు... భావోద్వేగాలూ బలమైన ప్రభావం చూపిస్తాయ’’ని చెప్పారు మల్లి అంకం. -
భయపెడుతూనే నవ్విస్తుంది.. బాక్
‘అస్సామీ జానపదంలో బాక్ అనే దెయ్యం ఉందని మా దర్శకుడు తన స్క్రిప్ట్ పరిశోధనలో తెలుసుకున్నారు. అసలు ఆ బాక్ కథ ఏమిటి? తను ఏం చేస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు ప్రముఖ నటి ఖుష్బూ. -
విదేశాల్లో వచ్చినా... మన దేశంలో రాలేదు
‘‘సుహాస్ అనగానే వినూత్నమైన కథలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకూ భారతీయ తెరపై చూడని ఓ కొత్త కథని ‘ప్రసన్న వదనం’తో చెబుతున్నాం. -
నేను గ్యాంగ్స్టర్గా నటిస్తే...!
తన ఫొటోషూట్స్తో సామాజిక మాధ్యమాల్నీ సందడి చేస్తుంటుంది మాళవిక మోహనన్. చీర కట్టినా... చిట్టి పొట్టి ట్రెండీ దుస్తులేసినా గ్లామరస్గా కనిపించడంలో ఆమెదంటూ ఓ ప్రత్యేకమైన శైలి. -
యాక్షన్ గణేశుడు వస్తున్నాడు
గతేడాది ‘బేబీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ‘గం.. గం.. గణేశా’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి