Pushpa: అమ్మీ అమ్మీ అంటాంటే.. నీ పెళ్లాన్నై పోయినట్టుందిర సామీ

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. మలయాళ నటుడు ఫహద్‌.....

Updated : 08 Dec 2022 15:44 IST

ల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా గురువారం ‘‘సామీ నా సామీ’’ అనే ఓ మాస్‌ గీతాన్ని విడుదల చేశారు. కథానాయకుడి గుణగణాలని వర్ణిస్తూ నాయిక పాడుకునే పాట ఇది. ‘‘నువ్‌ అమ్మీ అమ్మీ అంటాంటే.. నీ పెళ్లాన్నైపోయినట్టుందిర సామీ. నా సామీ’’ అంటూ హుషారుగా సాగుతున్న ఈ గీతానికి చంద్రబోస్‌ సాహిత్యం అందించగా.. మౌనికా యాదవ్‌ ఆలపించారు. పాటలో బన్ని, రష్మిక వేసిన స్టెప్పులు.. వాళ్లిద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో పుష్ఫరాజ్‌ అనే స్మగ్లర్‌గా అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక కనిపించనుంది. ఈ సినిమాకి కూర్పు: ఆర్‌.కార్తిక్‌ శ్రీనివాస్‌, ఛాయాగ్రహణం: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని