Jayaram:కరోనాతో కన్నుమూసిన కెమెరామెన్
సాధారణ కథను సైతం తన కెమెరాతో అందంగా, అద్భుతంగా ఆవిష్కరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ కన్నుమూశారు.
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం. కరోనా మహమ్మారికి మరో సినీ ప్రముఖుడు బలయ్యారు. సాధారణ కథను సైతం తన కెమెరాతో అందంగా, అద్భుతంగా ఆవిష్కరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడగా, చికిత్స పొందుతూనే గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు, మలయాళ చిత్రాలకు ఆయన ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. తెలుగులో అగ్ర నటులు నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకూ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకూ ఆయన సినిమాటోగ్రాఫర్గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. బ్లాక్బస్టర్ చిత్రాలు, ‘మేజర్ చంద్రకాంత్’, ‘పెళ్లి సందడి’తో సహా అనేక చిత్రాలు ఆయన కెమెరా కాన్వాస్ నుంచి జాలువారినవే.జయరామ్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి..
జయరామ్ పుట్టి పెరిగింది వరంగల్. ఆయన బాబాయికి అక్కడ ఓ ఫొటో స్టూడియో ఉండేది. స్కూలు అయ్యాక రోజూ వెళ్లి ఆ స్టూడియోలో కూర్చోవడం అలవాటుగా మారింది. ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం, పోస్టర్ల మీద ఆయన ఫొటోలు చూసి మురిసిపోయేవారు. ఆ మహానటుడు నటించిన ఆఖరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’కు జయరామే సినిమాటోగ్రాఫర్. చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి ఏర్పడటంతో చెన్నై రైలెక్కారు. పాండీబజార్లో తెలుగు వాళ్లుంటారని అక్కిడికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆంధ్రాక్లబ్కు చేరుకుంటే దర్శకుడు గుత్తా రామినీడు కనిపిస్తే కలిసి మాట్లాడారు. ‘ఏం చేస్తావ్?’ అంటే ‘నాకేమీ తెలియదు’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఆంధ్రా క్లబ్ కు సెక్రటరీ. మేనేజర్ని పిలిచి ‘ఇతనికో జాబ్ ఇవ్వు’ అన్నారు. అలా ఆ క్లబ్ లో క్యాషియర్ స్థాయికి ఆయన ఉద్యోగం ఎదిగింది. ఆ తర్వాత అసిస్టెంట్ కెమెరామెన్, సినిమాటోగ్రాఫర్గా ఎదిగారు.
ఎల్వీ ప్రసాద్ కుమారుడు ఆనంద్ బాబు ప్రోత్సహంతోనే ఆయన అంచెలంచెలుగా ఎదగ గలిగారు. జయరామ్ కెమెరామన్గా తొలి చిత్రం చిరంజీవిది కావడం విశేషం. సి.వి. రాజేంద్రన్ దర్శకుడు. సినిమా పేరు కూడా చిరంజీవే. ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం’ సినిమాటోగ్రాఫర్గా ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది. వాసు దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగును వారం రోజుల్లో పూర్తిచేయడం విశేషం. ప్రముఖ మలయాళ దర్శకుడు ఐవీ శశి ‘1921’ సినిమాకి మమ్ముట్టి హీరో, సినిమాటోగ్రాఫర్ జయరామ్. ఇది పీరియాడికల్ సినిమా. జయరామ్కు అవార్డును సంపాదించిపెట్టిన సినిమా ఇది. నటి సౌందర్య ఆఖరి చిత్రం ‘శివశంకర్’కు కూడా ఆయన పనిచేశారు. ఇందులో ఆమె చనిపోయే సన్నివేశాలను కూడా ఆయనే చిత్రీకరించారు. రెండ్రోజుల్లో వస్తానన్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం తనను కలచివేసిందని ఓ ఇంటర్వ్యూలో జయరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ను చూడాలన్న ఆసక్తితో సినిమా రంగంలో అడుగుపెట్టి ఆయన నటించిన మంచికి మరోపేరు, డ్రైవర్ రాముడు, వేటగాడు, సింహబలుడు, ఆఖరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ ఇలా ఎన్నో సినిమాలకు పనిచేశారు. కె. రాఘవేంద్రరావు సినిమాలకూ, మోహన్ బాబు సొంత బ్యానర్ లో నిర్మించిన ఎన్నో చిత్రాలకూ జయరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. జయరామ్ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం
‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. దీనికి జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. -
ఊరిస్తున్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్. ‘వార్ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. -
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. -
మెరుపుల తార.. తళుకుల చీర
అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక అలియా భట్ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక ‘మెట్ గలా’లో ఆమె చీరలో మెరిసింది. -
రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘డియర్ స్టూడెంట్స్’ సందడి మొదలు
ఇటీవలే ‘డియర్ స్టూడెంట్స్’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రాయ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. -
జులై 20న... కౌలాలంపూర్లో
తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.