Tollywood: అందరి గురి సంక్రాంతి బరి
ముగిసింది వేసవి సీజనే. జులైలో బాక్సాఫీసుకి విరామం లేకుండా వరుస కడుతున్నాయి కొత్త సినిమాలు. ఆ తర్వాత దసరా, దీపావళి చిత్రాలు ఉండనే ఉంటాయి. వాటి సందడి ఇంకా షురూ అవ్వనే లేదు. అప్పుడే చిత్రసీమ సంక్రాంతిపై గురి పెట్టింది. పెద్ద పండగ తీసుకొస్తున్న పెద్ద సీజన్
ముగిసింది వేసవి సీజనే. జులైలో బాక్సాఫీసుకి విరామం లేకుండా వరుస కడుతున్నాయి కొత్త సినిమాలు. ఆ తర్వాత దసరా, దీపావళి చిత్రాలు ఉండనే ఉంటాయి. వాటి సందడి ఇంకా షురూ అవ్వనే లేదు. అప్పుడే చిత్రసీమ సంక్రాంతిపై (Sankranthi) గురి పెట్టింది. పెద్ద పండగ తీసుకొస్తున్న పెద్ద సీజన్ కోసం వరుసగా కట్చీఫ్ వేసేస్తున్నాయి సినిమాలు. మరికొంతమంది నిర్మాతలు మనకీ బెర్తు దొరక్కపోతుందా? అంటూ నిశితంగా గమనిస్తున్నారు.
తెలుగులో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు నాలుగే. వీటి మధ్యలో ఒకట్రెండు చిన్న సినిమాలకీ చోటు దక్కే అవకాశాలు ఉంటాయి. పోటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్ర కథానాయకుల చిత్రాలు నువ్వా నేనా అన్నట్టుగా సంక్రాంతి రేసులోకి వస్తుంటాయి. నిర్మాణంలో జాప్యం వల్లో... నిర్మాణానంతర పనులు పూర్తి కాలేదనో... ఇలా చాలా సినిమాలు మధ్యలోనే వెనకడుగు వేస్తుంటాయి. కొన్నిసార్లు ఎవ్వరూ ఊహించనివి సంక్రాంతి బరిలోకి దిగుతుంటాయి. రెండేళ్లుగా అదే జరిగింది. 2023 సంక్రాంతికి పక్కాగా వచ్చే సినిమాలేవనేది చెప్పలేం కానీ... ఇప్పటికి వచ్చేస్తున్నాం అని ఖరారు చేసినవి నాలుగు. చిరంజీవి 154వ చిత్రం, ప్రభాస్ ‘ఆదిపురుష్’, (Adipurush) విజయ్ ‘వారసుడు’, (Varasudu) పంజా వైష్ణవ్తేజ్ (Vaishnav Tej) కొత్త చిత్రం... ఇలా ఈ నాలుగూ పండగకొస్తున్నట్టుగా పోస్టర్లతో చెప్పేశాయి.
తనయుడి చిత్రం కాదని...
రామ్చరణ్ (RamCharan) - శంకర్ (Shankar) (RC15) కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2023 సంక్రాంతి లక్ష్యంగా చిత్రీకరణ సాగింది. నిర్మాత దిల్రాజు (Dilraju) సంక్రాంతికి తీసుకొస్తామని పలుమార్లు వెల్లడించారు. ఇప్పుడీ చిత్రం ఆ రేసు నుంచి దాదాపుగా వైదొలగినట్టే. బాబీ (Bobby) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి (Chiranjeevi) 154వ (Chiru 154) చిత్రం సంక్రాంతి బరిలో దిగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రమది. ఇటీవలే ఆ సినిమాని సంక్రాంతికి తీసుకొస్తున్నాం అని ప్రకటించారు నిర్మాతలు. దిల్రాజు నిర్మిస్తున్న మరో చిత్రం ‘వారసుడు’ (Varasudu) సంక్రాంతికి విడుదల ఖరారైంది. విజయ్ (Vijay) కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెర కెక్కుతున్న చిత్రమిది.
ఆ రెండూ...
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). మోషన్ క్యాప్చర్ సాంకేతితతో రూపొందుతున్న ఈ సినిమా 12 జనవరి 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం ఆధారంగా ఓం రౌత్ (Omraut) తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రభాస్ శ్రీరాముడిగా కనిపిస్తారు. సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణుడిగా నటించారు. కృతిసనన్, సన్నీసింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైష్ణవ్తేజ్ (Vaishnav Tej) కథానాయకుడిగా శ్రీకాంత్రెడ్డి అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమా సంక్రాంతికే విడుదలవుతుంది. ఆ మేరకు చిత్రబృందం పోస్టర్తోపాటుగా విడుదల విషయాన్ని ప్రకటించింది. అగ్ర తారలు నటిస్తున్న మరికొన్ని సినిమాలూ సంక్రాంతినే లక్ష్యంగా చేసుకున్నాయి. బయటికి ప్రకటించకపోయినా ఆలోపు అన్ని పనులూ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో ముస్తాబవుతున్నాయి. మధ్యలో ఏ సినిమా రేసు నుంచి తప్పుకొన్నా వాటి స్థానంలో కొత్త చిత్రాలు బరిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!