Veera Simha Reddy: ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్.. ఒంగోలులో ట్రాఫిక్ ఆంక్షలు
పోలీసుల ఆంక్షల నడుమ ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సర్వం సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం ఒంగోలులో జరగనున్న ఈ ఈవెంట్లో చిత్రబృందం, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.
ఇంటర్నెట్డెస్క్: నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) ప్రీ రిలీజ్ వేడుకకు ఒంగోలులోని బీఎంఆర్ వెంచర్స్ సిద్ధమవుతోంది. చిత్ర నటీనటులతోపాటు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ వేడుకను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం మంగమ్మ కాలేజీ, మార్కెట్ యార్డ్ల్లో పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.
ఉత్కంఠ నడుమ..!
‘వీరసింహారెడ్డి’ ముందస్తు విడుదల వేడుక ఈనెల 6న (శుక్రవారం) సాయంత్రం నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించుకున్నప్పటి నుంచి అభిమానులు ఆశగా ఎదురుచూశారు. తర్జనభర్జనలు, తీవ్ర ఉత్కంఠ నడుమ త్రోవగుంట సమీపంలోని బీఎంఆర్ అర్జున్స్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన స్థలంలో కఠిన నిబంధనల నడుమ వేడుకకు పోలీసులు అనుమతినిచ్చారు. తొలుత ఈ కార్యక్రమాన్ని స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఏబీఎం కళాశాల మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. నిర్వహణ బాధ్యతలు చూసే శ్రేయాస్ మీడియా ప్రతినిధులు ఎస్పీ మలికా గార్గ్తో సమావేశమయ్యారు. అర్జున్స్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన 17 ఎకరాల స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించి ఇక్కడ ఏర్పాటుకు అనుమతి కోరారు. బుధవారం రాత్రంతా తర్జనభర్జనలు జరిగాయి. చివరకు వేడుక నిర్వహణకు మౌఖిక ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు పార్కింగ్ ప్రదేశాలు, ఇతర అంశాలపై మెలిక పెట్టారు. గురువారం ఉదయం నుంచి పనులు ఆరంభించిన నిర్వాహకులు సాయంత్రానికి ప్రధాన వేదిక, లైటింగ్, ఎల్ఈడీ తెరలు, బారికేడ్లు, వివిధ గ్యాలరీల నిర్మాణాలు చేపట్టారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ నాగరాజు, దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి సందర్శించి పలు సూచనలు చేశారు. సుమారు వెయ్యి మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు.. రూ.15 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని సూచించారు. అనుమతించిన సంఖ్య కంటే అదనంగా ప్రేక్షకులను లోపలికి రానివ్వకూడదని, అక్కడ జరిగే ప్రతి విషయానికీ నిర్వాహకులే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. నిర్వాహకులు జారీ చేసిన పాసులు ఉన్నవారికి మాత్రమే ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని.. వాటికి కూడా స్థానిక పోలీసుల స్టాంపింగ్ తప్పనిసరని పేర్కొన్నారు. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల ఏర్పాటుతో పాటు వివిధ గ్యాలరీలకు పటిష్టమైన బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని.. బాణసంచా కాల్చకూడదని సూచించారు. వేడుకలకు పోలీసు భద్రత ఉంటుందని.. అయితే నిర్వాహకులు సైతం తగిన సంఖ్యలో బౌన్సర్లు, వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిన్నారులు, వృద్ధులను ప్రాంగణంలోకి అనుమతించకూడదని.. సినిమాకు సంబంధించి మినహా, మరే ఇతర రెచ్చగొట్టే నినాదాలు చేయకూడదని నిబంధనలు విధించారు.
ట్రైలర్ రానుంది..!
మాస్ యాక్షన్, ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్ను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ట్రైలర్ విడుదల జరగనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. దీంతో నందమూరి అభిమానులు సోషల్మీడియా వేదికగా కౌంట్డౌన్ మొదలు పెట్టారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈసినిమా కోసం బాలకృష్ణ, శ్రుతిహాసన్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ సినిమా విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
ధోనీపై కమల్ హాసన్ ప్రశంసలు కురిపించారు. క్రిస్గేల్తో కలిసి దిగిన ఫొటోను రిషబ్ షేర్ చేశారు. -
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. -
మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్ ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. -
సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్ సీక్వెన్స్!
‘కంగువా’ ఫైటింగ్ సీక్వెన్స్కు సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో షేర్ అవుతోంది. -
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన ప్రశాంత్ కిశోర్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..