Vishal: ‘రత్నం’.. పూర్తి చేశాడు

‘రత్నం’గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు విశాల్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌, జీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 24 Jan 2024 10:56 IST

‘రత్నం’గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు విశాల్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌, జీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రియా భవానీ శంకర్‌ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు విశాల్‌ మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. కుటుంబ అంశాలతో నిండిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. చెన్నై, తిరుపతి, తిరుచ్చి, కారైకుడి, వెల్లూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘భరణి’, ‘పూజ’ లాంటి చిత్రాల తర్వాత విశాల్‌ - హరి నుంచి వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని