America: బస్సుంది... డ్రైవర్ లేడు..
అమెరికా బోస్టన్లోని ఓ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఇటీవల తన విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లాలనుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం.. చార్టర్డ్ ఎల్లో స్కూల్ బస్సులో వెళ్లాలి. వాహనాన్ని బుక్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. అవతలి వైపునుంచి ఒక సమాధానం...
అగ్రరాజ్యాన్ని వేధిస్తున్న స్కూల్ బస్ డ్రైవర్ల కొరత
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా బోస్టన్లోని ఓ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఇటీవల తన విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లాలనుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం.. చార్టర్డ్ ఎల్లో స్కూల్ బస్సులో వెళ్లాలి. వాహనాన్ని బుక్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. అవతలి వైపునుంచి ఒక సమాధానం వచ్చింది. ‘డ్రైవర్లు లేరు’ అని. దీంతో చేసేదేమీ లేక ప్రైవేట్ పార్టీలకు వినియోగించే ఓ బస్సులో తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది కేవలం బోస్టన్లోని ఓ స్కూల్ పిల్లలకు మాత్రమే ఎదురైన సమస్య కాదు. ఇప్పుడు అగ్రరాజ్యం అంతా.. స్కూల్ బస్ డ్రైవర్ల కొరతతో అల్లాడుతోంది! ఇటీవల మాసాచుసెట్స్లో పిల్లలను బడులకు తీసుకెళ్లేందుకుగానూ అక్కడి గవర్నర్ సైన్యంలోని 250 మందిని డ్రైవర్లుగా నియమించడం.. అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. టెక్సాస్లో స్కూల్ డిస్టిక్స్(పాఠశాలల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంగణాలు).. తమ ఉపాధ్యాయులు, బాస్కెట్బాల్ కోచ్లను బస్సులు నడపమని కోరుతుండటం గమనార్హం. పెన్సిల్వేనియాలో అయితే కొన్ని స్కూల్ డిస్టిక్స్.. స్వచ్ఛందంగా బస్సు సేవలు వదులుకోవాలని కోరుతూ విద్యార్థుల కుటుంబాలకు నెలకు 300 డాలర్లు చెల్లిస్తున్నాయి.
5 లక్షలకు పైగా బస్సులు..
అమెరికావ్యాప్తంగా ఏటా ఒకటినుంచి 12వ తరగతిలోపు విద్యార్థుల్లో దాదాపు 55 శాతం(2.5 కోట్లు) మంది స్కూల్ బస్సులను ఆశ్రయిస్తారు. మొత్తం 5 లక్షలకు పైగా బస్సులు ఉన్నాయి. దాదాపు 13,800 స్కూల్ డిస్టిక్స్ అన్ని కలిపి ఏడాదికి రూ.2200 కోట్లు విద్యార్థుల రవాణాపై ఖర్చు చేస్తాయి. మొత్తం బస్సుల్లో 60 శాతం ఆయా స్కూళ్లవే కాగ, మిగతా 40 శాతం ప్రైవేటువి. అంతా బాగున్న రోజుల్లో ప్రైవేటు సంస్థలూ భారీ లాభాలు ఆర్జించాయి. కానీ.. ఇప్పుడు డ్రైవర్లు లేక బస్సులు రోడ్డెక్కని దుస్థితి. వాస్తవానికి ఈ సమస్య కొత్తేమి కాదు. కరోనా ముందు కూడ ఎదురయినదే. కానీ.. మహమ్మారి కారణంగా పాఠశాలలకు ఏడాదికి పైగా సుదీర్ఘ విరామం రావడంతో సమస్య తీవ్రమైంది. ఇప్పుడు స్కూళ్లు పునః ప్రారంభమైనా.. డ్రైవర్ల కొరత 30 శాతంనుంచి 50 శాతానికి పెరగడంతో ఇక్కట్లు మొదలయ్యాయి.
అసలు ఎందుకీ సమస్య..
* కరోనా నేపథ్యంలో గతేడాది అమెరికాలోని 95 శాతం పాఠశాలలు ఆన్లైన్ విద్యాబోధన వైపు మళ్లాయి. దీంతో బస్సులు మూలకు చేరాయి. ఏడాదిలో 180 రోజులు స్కూళ్లపై ఆధారపడే ప్రైవేటు బస్సు సంస్థలూ తమ డ్రైవర్లను తొలగించాయి. కొన్ని లే ఆఫ్ విధించాయి. దీంతో సదరు డ్రైవర్లు ఇతర ఉద్యోగాలు వెతుక్కున్నారు. ఇప్పుడు వారు తిరిగి రావడం లేదు.
* ప్రస్తుతం పాఠశాలలు పునఃప్రారంభమైనా.. మిగిలిన కొంతమంది డ్రైవర్లు కూడ ఆరోగ్య సమస్యలతో స్వచ్ఛందంగా విధులకు స్వస్తి పలికారు. కఠినమైన పని వేళలు, తక్కువ వేతనాలు, రెండు షిఫ్టుల్లో విధుల కారణంగా ఇతర ఆదాయ మార్గాలు కష్టతరమవుతుండటంతో చాలామంది వెనకడుగు వేస్తున్నారు.
* అమెరికాలో స్కూలు బస్సు డ్రైవర్ల సగటు వయస్సు 56. అక్కడి సాధారణ కార్మికుడి సగటు కంటే 14 ఏళ్లు ఎక్కువ. వయస్సు పైబడినవారికి కొవిడ్ సోకడం, మరణించే అవకాశాలు ఎక్కువని ప్రచారం ఉండటం, పైగా వృత్తిలో భాగంగా ఇన్పెక్షన్ సోకే ప్రమాదం అధికమని చాలామంది భావిస్తున్నారు. దీంతో విధులకు వచ్చేందుకు భయపడుతున్నారు!
* డ్రైవర్లకు వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఇది పొందాలంటే అమెరికాలో దాదాపు 12 వారాల సమయం పడుతుంది. దాదాపు వెయ్యి డాలర్ల వరకు ఖర్చవుతుంది. ఇది భరించలేక కొత్తవారు ఇటువైపు రావడం లేదు. పైగా ఈ లైసెన్సు ఉన్నవారికి ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది. అమెజాన్ తదితర సంస్థలు అధిక వేతనాలు ఆఫర్ చేస్తున్నాయి.
* తరగతుల నిర్వహణ ఏడాదికి 180 రోజులు మాత్రమే ఉంటుంది. మిగతా సమయాల్లో బస్సు డ్రైవర్లకు వేతనాలు చెల్లించరు! జీతాల పెంపు, ఇతర ప్రయోజనాలు తక్కువే.
సర్వేలో ఆసక్తికర అంశాలు..
బస్సుల కొరత సమస్యపై ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం.. 81 శాతం కంటే ఎక్కువ స్కూల్ డిస్టిక్స్ సరిపడ బస్సు డ్రైవర్లను సమకూర్చుకోలేకపోయాయి.
* 51 శాతానికి పైగా స్కూల్ డిస్టిక్స్ ఈ సమస్యను తీవ్రమైన, తీర్చలేనిదిగా పేర్కొన్నాయి.
* డ్రైవర్ల కొరత తీవ్రంగా మారుతోందా అంటే 78 శాతం అవునని బదులిచ్చాయి.
* మాకు ఎదురవుతున్న సమస్యల్లో ఇదే మొదటిదని 65 శాతం వెల్లడించాయి.
పరిష్కారానికి ఏం చేస్తున్నారు..
బస్సు డ్రైవర్ల వేతనాలు పెంచేందుకు ప్రైవేటు యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. సాధారణంగా ఈ విధులు నిర్వహించే వారికి గంటకు 16 డాలర్ల చొప్పున చెల్లిస్తారు. ప్రస్తుతం ‘ఫస్ట్ స్టూడెంట్’ అనే ప్రైవేటు సంస్థ గంటకు 21 డాలర్ల చొప్పున చెల్లించేందుకు సిద్ధమైంది. పెన్సిల్వేనియా, అరిజోనా, వర్జినియా తదితర రాష్ట్రాలు బోనస్లు ప్రకటిస్తున్నాయి. కానీ.. ‘ది గ్రేట్ రెజిగ్నేషన్’ సంక్షోభం కొనసాగుతోన్న ప్రస్తుత తరుణంలో అగ్రరాజ్యం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో ఎదురు చూడాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM