దీదీని ఎందుకు ప్రశ్నించరు..?: మోదీ
రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ సమ్మాన్ నిధిని రైతులకు అందకుండా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
ఆ 70లక్షల మంది రైతులకు దక్కని పీఎం కిసాన్!
దిల్లీ: రాజకీయ కారణాలతోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ సమ్మాన్ నిధిని రైతులకు అందకుండా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతుల ప్రయోజనం కోసం ఉన్న ఈ పథకాన్ని దీదీ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై మౌనంగా ఎందుకు ఉన్నారని విపక్షాలను ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతున్నప్పటికీ .. కేవలం పశ్చిమ బెంగాల్లోనే అమలు కాకపోవడంపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) మరో దఫా పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిన సందర్భంగా ఈ విధంగా మాట్లాడారు.
మమతా బెనర్జీ సిద్ధాంతాలతో ఇప్పటికే పశ్చిమ బెంగాల్ తీవ్రంగా నష్టపోయిందని విమర్శించిన మోదీ, రైతులకు వ్యతిరేకంగా దీదీ తీసుకుంటున్న చర్యలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రైతుల విషయంలో కేరళ తీరును కూడా నరేంద్ర మోదీ తప్పుబట్టారు. పంజాబ్ రైతులను తప్పుదోవ పట్టించేందుకు విపక్షాలకు సమయం ఉందని.. కానీ, కేరళలో రైతు సంస్కరణలు తీసుకొచ్చేందుకు మాత్రం ఎందుకు సమయముండదని అక్కడి ప్రభుత్వానికి చురకలు అంటించారు.
ఇదిలాఉంటే, రైతులకు నేరుగా నగదు బదిలీ చేసే పథకమైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) ప్రయోజనాలు మాత్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి అందడం లేదు. దీంతో అక్కడి దాదాపు 70లక్షల మంది రైతులు ఈ పథకానికి దూరమయ్యారు. ఇప్పటికే అక్కడ దాదాపు 23లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారి సమాచారాన్ని తనిఖీ చేసి కేంద్రానికి పంపించేందుకు మమతా సర్కార్ వెనుకడుగు వేస్తోంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.లక్షా 10వేల కోట్ల రూపాయలను పలు దఫాల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు బదిలీ చేసింది.
ఇవీ చదవండి..
రైతుల జీవితాలతో ఆడుకోవద్దు: మోదీ
వ్యవసాయ చట్టాల అమలు: ఒక్క ఏడాది చూడండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.