అధిష్టానాన్ని ఎలాంటి పదవి కోరలేదు: పైలట్
కాంగ్రెస్ తిరుగుబాటు నేత, రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం సాయంత్రం జైపుర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మద్దతుదారుల నుంచి ఆయనకు...
జైపుర్ విమానాశ్రయంలో ఘనస్వాగతం
జైపుర్: కాంగ్రెస్ తిరుగుబాటు నేత, రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మంగళవారం సాయంత్రం జైపుర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మద్దతుదారుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్తో విభేదించి సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో నెల రోజులుగా హరియాణాలోని ఒక రిసార్టులో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అనంతరం పార్టీలో కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సచిన్ వర్గం డిమాండ్లను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కే.సీ. వేణుగోపాల్ ప్రకటించారు. దీంతో రాజస్థాన్లో నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. దీంతో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం సచిన్ పైలట్ జైపుర్కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ తాను ఎలాంటి పదవి డిమాండ్ చేయలేదని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అలానే రాజకీయాల్లో సమస్యలు, విధానాలపరంగా పనిచేయాలని, వ్యక్తిగత శత్రుత్వం ఉండకూడదని అన్నారు. పార్టీ నాయకత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా తాము మాట్లాడలేదని, తమ గురించి కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ, ఎన్నో రకాల ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ ఈ 30 రోజులు తాము ఎంతో ఓపికతో వ్యవహరించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని మాత్రమేనని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.