ఎమ్మెల్సీ ఎన్నికలపై టీకాంగ్రెస్‌ సమావేశం

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సమావేశమయ్యారు.

Published : 27 Sep 2020 17:32 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఎన్నికలు జరగనున్న వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర నేతలతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు విషయంలో డీసీసీ అధ్యక్షుడు, ముఖ్యనేతలు శ్రద్ధ వహించాలని ఉత్తమ్‌ సూచించారు. 

ఇన్‌ఛార్జిగా నియమితులైన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌ వచ్చిన మాణికం ఠాగూర్‌..గాంధీభవన్‌లో శనివారం జరిగిన పీసీసీ కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ అంశాలు చర్చించడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. నెలలో రెండు సార్లు కోర్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని..అన్ని విషయాలు చర్చించుకుందామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని