BRS: రాహుల్‌ గాంధీపై ఎన్నికల సంఘానికి భారాస ఫిర్యాదు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి భారాస ఫిర్యాదు చేసింది.

Published : 08 Apr 2024 22:33 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) భారాస (BRS) ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం తుక్కుగూడలో నిర్వహించిన సభలో భారాస అధినేత కేసీఆర్‌(KCR)పై రాహుల్‌ నిరాధార ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నవేళ దురుద్దేశపూర్వకంగానే రాహుల్‌ ఆరోపణలు చేశారని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని భారాస కోరింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిషేధించాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు మంత్రి కొండా సురేఖపైనా భారాస ఫిర్యాదు చేసింది. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించాలని కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని