Telangana News: పార్టీ వీడొద్దని జగ్గారెడ్డి కాళ్లు పట్టుకున్న కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ పార్టీని వీడిపోకుండా జగ్గారెడ్డికి బుజ్జగింపు ప్రయాత్నాలు మొదలయ్యాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్) కలిశారు.
హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఈ ఉదయం కలిశారు. కాంగ్రెస్కు దూరం కావొద్దని జగ్గారెడ్డికి వీహెచ్ విజ్ఞప్తి చేశారు. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడాలని సూచించారు. కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం వెల్లడిస్తానని జగ్గారెడ్డి ఈ సందర్భంగా వీహెచ్కు తెలిపారు. మరోవైపు పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్.. జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని బతిమిలాడటం గమనార్హం. పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీని వీడనని ఆయన స్పష్టం చేశారు. రాజీనామా చేయొద్దని పార్టీ అధిష్ఠానం కోరిందని చెప్పారు. మరోవైపు పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు సోనియాగాంధీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. తన మీద సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నట్లు.. దీనిపై పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు.
మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తనపై, జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వీహెచ్ అన్నారు. తెరాసలో చేరుతున్నట్లు తమ ఫొటోలు మార్ఫింగ్ చేశారని చెప్పారు. తెరాసకు అనుకూలంగా పని చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వీహెచ్ తెలిపారు. ఎన్నికల కమిషన్కు కూడా దీనిపై ఫిర్యాదు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
-
నారు పోశావా.. నీరు పెట్టావా.. మా భూములపై నీ పెత్తనం ఏంటీ?
-
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
-
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
-
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్