అమరావతికి కట్టుబడి ఉన్నాం: జీవీఎల్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు మరోసారి స్పష్టత ఇచ్చారు. రాజధాని విషయంలో భాజపాలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు..

Published : 28 Feb 2020 21:43 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు మరోసారి స్పష్టతనిచ్చారు. రాజధాని విషయంలో భాజపాలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలన్న అంశానికి తాము కట్టుబడి ఉన్నామని జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. అయితే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు అంశం తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశమే అని స్పష్టం చేశారు. హైకోర్టు అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కలిసి మాట్లాడతానని జీవీఎల్‌ తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని