Daggubati Purandeswari: ‘చంద్రబాబు అరెస్టుతో భాజపాకు సంబంధం లేదు’
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన అరెస్టును తొలుత ఖండించింది తమ పార్టీయేనని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు.
విజయవాడ వన్టౌన్, న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన అరెస్టును తొలుత ఖండించింది తమ పార్టీయేనని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానం కరెక్టు కాదని అభిప్రాయడ్డారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, మాట్లాడారు. ‘తెదేపాతో కలిసి పోటీ చేసే విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు. ఈ అంశంపై ఆయన భాజపా అధిష్ఠానంతో చర్చిస్తానని చెప్పారు. ఆ సమయంలో మా అభిప్రాయాన్నీ చెబుతాం. ప్రస్తుతం జనసేన, భాజపా పొత్తు కొనసాగుతోంది. రాష్ట్రంలో సీఐడీ ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తోంది. చంద్రబాబు అరెస్టులో భాజపా ప్రమేయం ఉందంటూ వైకాపా అసత్య ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పార్టీ పెద్దలంతా చంద్రబాబు అరెస్టును ఖండించారు’ అని వెల్లడించారు. అనంతరం మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాతూరి నాగభూషణం, అడ్డూరి శ్రీరామ్, షేక్ బాజీ, పొట్టి శ్రీహరి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.