సీఎం జగన్ బెయిల్ వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలి
రూ.43 వేల కోట్ల అవినీతి నేరాభియోగ కేసుల్లో జగన్... పదేళ్ల క్రితం సెప్టెంబరు 23న జైలు నుంచి బెయిల్పై విడుదలైన రోజును పండగలా జరుపుకోవడంలో తప్పులేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు.
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా
ఈనాడు, దిల్లీ: రూ.43 వేల కోట్ల అవినీతి నేరాభియోగ కేసుల్లో జగన్... పదేళ్ల క్రితం సెప్టెంబరు 23న జైలు నుంచి బెయిల్పై విడుదలైన రోజును పండగలా జరుపుకోవడంలో తప్పులేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చట్టం అందరికీ సమానమని అంటారని.. ఆ చట్టానికి అతీతుడినని నిరూపించిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. జగన్ రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా శాస్త్రీయ ఆధారాలను సీబీఐ అధికారులు న్యాయస్థానానికి సమర్పించినా... పదేళ్లుగా ఆ కేసుల ట్రయల్స్ పూర్తికాకుండా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ అడ్డుకోగలిగిన సమర్థుడన్నారు. సీఎం అయ్యాక సీబీఐ కోర్టు విచారణకే హాజరు కావాల్సిన అవసరం లేదన్నట్లుగా అద్భుతమైన ఆర్డర్ తెచ్చుకున్న ఘనుడు జగన్ అని రఘురామ విమర్శించారు. ఈ సందర్భంగా జగన్కు దశమ బెయిల్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన కేకు కోశారు. తమ సీఎం ఇలాగే మరెన్నో బెయిల్ వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వ్యంగ్యంగా అన్నారు. జగన్ 11వ బెయిల్ వార్షికోత్సవం నాటికి తాను వైకాపాలో ఉండనన్నారు. జగన్ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేయాలని మాజీఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్కు రఘురామ సూచించారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు తుదిదశకు చేరుకోవడంతో, ఆ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారేమోనని ఎంపీ సందేహం వ్యక్తం చేశారు. ‘వివేకా హత్యకేసులో కేసు డైరీ కీలకం కానుంది. దీన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. హత్య జరిగాక ఎవరు ఎవరితో మాట్లాడుకున్నదీ కేసు డైరీలో సవివరంగా ఉంది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ప్రస్తుత అక్రమ అరెస్టుల పర్వానికి తెరలేపారు. సుప్రీంకోర్టులో అక్టోబరు 11న జరగనున్న వాదనల్లో అన్ని విషయాలూ వెలుగుచూసే అవకాశం ఉంది’ అని రఘురామ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నాతో చర్చకు మోదీ రారు: రాహుల్
ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు. -
రేపే ఐదో విడత.. 49 లోక్సభ స్థానాలకు పోలింగ్
సార్వత్రిక సమరంలో మరో కీలక దశకు రంగం సిద్ధమైంది. ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
మీ పార్టీ కార్యాలయానికి వస్తా
భాజపా ప్రధాన కార్యాలయానికి ఆదివారం తాను తమ పార్టీ నేతలతో కలిసి వెళ్తానని దిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. ఆ సందర్భంగా ఎవరిని కోరుకుంటే వారిని ప్రధానమంత్రి జైలుకు పంపించుకోవచ్చని పేర్కొన్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
మహా యుద్ధం
మహారాష్ట్రలోని కీలకమైన ముంబయితోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. -
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యంతో పాటు ప్రతి గింజను ప్రభుత్వం కొనాలని, హామీ మేరకు వరి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని రాష్ట్ర భాజపా నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. -
లద్దాఖ్లో హోరాహోరీ
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్ మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుందని తొలుత భావించగా.. స్థానికంగా గట్టి పట్టున్న ఓ గ్రూపు స్వతంత్ర అభ్యర్థిని బరిలో దించడంతో పోరు త్రిముఖంగా మారింది. -
అవినీతి కేసు బూచితో మాలీవాల్ను కుట్రలో భాగం చేశారు
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై ఉన్న అక్రమ నియామకాల కేసును బూచిగా చూపి, బెదిరించి సీఎం కేజ్రీవాల్కు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో భాజపా ఆమెను పావుగా మార్చిందని ఆప్ ఆరోపించింది. -
జూన్ తొలివారంలోనే ‘రైతు భరోసా’ ఇవ్వాలి
జూన్ తొలి వారంలోనే ‘రైతు భరోసా’ డబ్బులివ్వాలని... పంటసాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లకుండా చూడాలని భారాస మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. -
రేవంత్రెడ్డికి గ్యారంటీలు అమలు చేసే శక్తి లేదు
‘ఆరు గ్యారంటీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు. కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితిలో లేరు. -
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గట్టికౌంటర్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు