సీఎం జగన్ బెయిల్ వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలి
రూ.43 వేల కోట్ల అవినీతి నేరాభియోగ కేసుల్లో జగన్... పదేళ్ల క్రితం సెప్టెంబరు 23న జైలు నుంచి బెయిల్పై విడుదలైన రోజును పండగలా జరుపుకోవడంలో తప్పులేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు.
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా
ఈనాడు, దిల్లీ: రూ.43 వేల కోట్ల అవినీతి నేరాభియోగ కేసుల్లో జగన్... పదేళ్ల క్రితం సెప్టెంబరు 23న జైలు నుంచి బెయిల్పై విడుదలైన రోజును పండగలా జరుపుకోవడంలో తప్పులేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చట్టం అందరికీ సమానమని అంటారని.. ఆ చట్టానికి అతీతుడినని నిరూపించిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. జగన్ రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా శాస్త్రీయ ఆధారాలను సీబీఐ అధికారులు న్యాయస్థానానికి సమర్పించినా... పదేళ్లుగా ఆ కేసుల ట్రయల్స్ పూర్తికాకుండా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ అడ్డుకోగలిగిన సమర్థుడన్నారు. సీఎం అయ్యాక సీబీఐ కోర్టు విచారణకే హాజరు కావాల్సిన అవసరం లేదన్నట్లుగా అద్భుతమైన ఆర్డర్ తెచ్చుకున్న ఘనుడు జగన్ అని రఘురామ విమర్శించారు. ఈ సందర్భంగా జగన్కు దశమ బెయిల్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన కేకు కోశారు. తమ సీఎం ఇలాగే మరెన్నో బెయిల్ వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వ్యంగ్యంగా అన్నారు. జగన్ 11వ బెయిల్ వార్షికోత్సవం నాటికి తాను వైకాపాలో ఉండనన్నారు. జగన్ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేయాలని మాజీఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్కు రఘురామ సూచించారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు తుదిదశకు చేరుకోవడంతో, ఆ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారేమోనని ఎంపీ సందేహం వ్యక్తం చేశారు. ‘వివేకా హత్యకేసులో కేసు డైరీ కీలకం కానుంది. దీన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. హత్య జరిగాక ఎవరు ఎవరితో మాట్లాడుకున్నదీ కేసు డైరీలో సవివరంగా ఉంది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ప్రస్తుత అక్రమ అరెస్టుల పర్వానికి తెరలేపారు. సుప్రీంకోర్టులో అక్టోబరు 11న జరగనున్న వాదనల్లో అన్ని విషయాలూ వెలుగుచూసే అవకాశం ఉంది’ అని రఘురామ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Amaravati: ఓట్ల తొలగింపు.. 8 జిల్లాల కలెక్టర్లపై ఈసీకి తెదేపా నేతల ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. -
TS Elections: మంత్రి కేటీఆర్పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్.. భారాస క్యాడర్కు పిలుపునిచ్చి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. -
Btech Ravi: తెదేపా నేత బీటెక్ రవికి బెయిల్ మంజూరు
వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)(Btech Ravi)కి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
TS Elections: కల్వకుర్తిలో కాంగ్రెస్, భారాస శ్రేణుల ఘర్షణ
అసెంబ్లీ ఎన్నికల (Telangana Election 2023) నేపథ్యంలో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
Nara Lokesh: చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ విశ్వప్రయత్నాలు: నారా లోకేశ్
రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆయన మాట్లాడారు. -
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని
కావలి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని వైకాపా అభిమాని పేముల మనోహర్ ప్రశ్నించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. -
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
‘ఎన్నికలకు మహా అయితే 140 రోజుల గడువుంది.. ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తేలిపోతుంది. -
అయిదేళ్లలో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
‘తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఆరు లక్షల మందికి, డీఎస్సీ ద్వారా 32 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. మూడు నెలలు ఓపిక పట్టండి.. అయిదేళ్లలో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. -
15 మందిలో 10 మంది వారే
ముఖ్యమంత్రి జగన్ నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి 15 మంది అఖిల భారత సర్వీసు అధికారులను కేంద్రం నుంచి డిప్యుటేషన్పై తీసుకొస్తే.. వారిలో పది మంది ఆయన సామాజికవర్గానికి చెందిన వారేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు. -
పర్చూరు వైకాపాలో భగ్గుమన్న అసమ్మతి
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో కార్యకలాపాలు పెరిగాయి. -
వైకాపా గద్దె దిగకుంటే ప్రజలకు కష్టాలే
ప్రభుత్వ ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. పీఎఫ్ చెల్లింపులు ఆగిపోయాయని, ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ నిధులూ అందడం లేదని విమర్శించారు. -
132 ఓట్ల తొలగింపునకు ఒకే వ్యక్తి దరఖాస్తు
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులోని మూడు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఒకే వ్యక్తి 132 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. -
ఓటర్ల జాబితాలో అక్రమాలపై విచారణ చేపట్టండి
జిల్లాలోని ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావును తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. -
మంత్రి బొత్స ఇలాకాలోని జాబితాలో మృతుల పేర్లు
మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో మృతి చెందిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని తెదేపా, జనసేన నాయకులు ఆరోపించారు. -
ఓటమి భయంతోనే చంద్రబాబును అడ్డుకుంటున్నారు
తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందనే భయంతోనే ఆయన్ను బయట తిరగకుండా అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టులో శతవిధాలా ప్రయత్నించారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
అప్పుల్లో దేశంలోనే నంబర్-1 గా ఏపీ
రాష్ట్రప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చి వాటిని చెప్పిన పనులకు వినియోగించకుండా తన రెవెన్యూ ఖర్చులకు ఉపయోగిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. -
మట్కా, బెట్టింగ్ ఆడేవారిని ఉరేస్తారా?
మట్కా, క్రికెట్ బెట్టింగ్కు పాల్పడేవారిపై.. వాటి నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి అన్నారు. -
అయిదు రాష్ట్రాల్లో.. 18% అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 18% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం అభ్యర్థుల్లో కోటీశ్వరుల వాటా 29%. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. -
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూబకాసురులు ఎవరు?
లేపాక్షి నాలెడ్జ్ హబ్కు సంబంధించిన రూ.వేల కోట్ల విలువైన భూములు కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులపరమవుతుంటేే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని తెదేపా అధికార ప్రతినిధి విజయ్కుమార్ ప్రశ్నించారు. -
ప్రధానికి స్వాగతం పలికేందుకు ఇంకెవరూ లేరా?
ఒక సామాజికవర్గానికి చెందిన వారే ప్రధాని మోదీకి స్వాగతం పలకడం వెనకున్న ఆంతర్యమేమిటో ప్రజలకు తెలియాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. -
లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరిన మండలాధ్యక్షులు
నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వ విధానాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వైకాపాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/11/23)
-
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
-
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
-
Minerals Auction: ₹45 వేల కోట్ల విలువైన ఖనిజ బ్లాకులకు ఈ-వేలం షురూ
-
Ts election: దేవుడి తోడు ఆ గుర్తుకే ఓటేస్తా.. రూ.వెయ్యి తీసుకుని ఓటర్ల ప్రమాణం
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్