BJP-JDS: ‘రెండు సీట్లకు ఇంత కష్టపడాలా?’ భాజపాపై కుమారస్వామి అసంతృప్తి!
‘రెండు సీట్ల కోసం ఇంత కష్టపడాలా?’ అంటూ కర్ణాటకలో భాజపాతో ఎంపీ సీట్ల సర్దుబాటుపై జేడీఎస్ నేత కుమారస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు.
బెంగళూరు: లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) విషయంలో కన్నడనాట భాజపా- జేడీఎస్ కూటమి మధ్య సీట్ల సర్దుబాటుపై విబేధాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తమకు రెండు స్థానాలు మాత్రమే కేటాయించేందుకు కమలదళం సిద్ధంగా ఉందని వస్తోన్న వార్తలపై జేడీఎస్ (JDS) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం కుమారస్వామి అసంతృప్తి వ్యక్తం చేశారు. జేడీఎస్ను గౌరవంగా చూడాలని భాజపా (BJP) అధిష్ఠానానికి తెలియజేయడంతో పాటు 18 ఎంపీ స్థానాల్లో మన బలం అర్థమయ్యేలా చెప్పాలని సమావేశంలో పార్టీ నేతలు తనకు సూచించినట్లు చెప్పారు.
‘‘రెండు సీట్ల కోసం ఇంత కష్టపడాలా? ఇన్ని సర్దుబాట్లు చేసుకోవాలా? హసన్, మాండ్యాల్లో స్వతంత్రంగా పోటీ చేసినా మా అభ్యర్థులు సులభంగా నెగ్గుతారు. మేం ఆరేడు సీట్లు అడగలేదు. మొదటినుంచి మూడు నుంచి నాలుగు సీట్లు కోరుతున్నాం. మా పార్టీ బలం భాజపాకు తెలుసు. పార్టీ విజ్ఞప్తిని మన్నిస్తారనే నమ్మకం ఉంది. అధికారిక ప్రకటన వెలువడేవరకూ సీట్ల కేటాయింపుపై మాట్లాడను’’ అని సమావేశం అనంతరం కుమారస్వామి మీడియాతో చెప్పారు.
బిహార్లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి.. అధిక స్థానాల్లో భాజపా పోటీ
గతేడాది సెప్టెంబర్లో ఎన్డీయే కూటమిలో జేడీఎస్ చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు సాగుతున్నాయి. మాండ్య, హసన్, కోలార్ స్థానాలను దేవేగౌడ పార్టీ ఆశిస్తోంది. రెండు పార్టీల మధ్య ఒప్పందం ప్రకారం.. దేవెగౌడ అల్లుడు డా.సీఎన్ మంజునాథ్ను భాజపా టికెట్పై బెంగళూరు రూరల్ నుంచి ఇప్పటికే బరిలోకి దించారు. అయితే.. కోలార్ను కేటాయించేందుకు కమలం పార్టీ సిద్ధంగా లేదనే వార్తలు వస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 స్థానాల్లో 25 చోట్ల భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. ప్రజల భూములు కొట్టేసే నల్ల చట్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. -
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్