KA Paul: ఉపఎన్నికలో గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: కేఏ పాల్‌

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌  అన్నారు. కేఏ పాల్ 59వ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం మునుగోడులో..

Published : 26 Sep 2022 02:07 IST

మునుగోడు: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌  అన్నారు. కేఏ పాల్ 59వ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం మునుగోడులో నిర్వహించిన సభకు ఆయన హాజరై మాట్లాడారు.. తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే.. మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, కార్పొరేట్‌ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పాల్ 59వ జన్మదినం సందర్భంగా 59 మందికి వీసా లక్కీ డ్రాను తీశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కోశాధికారి జ్యోతి, ప్రజాగాయకుడు గద్దర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని