Sharad Pawar: వారెంత ప్రయత్నించినా.. భాజపాతో పొత్తు ప్రసక్తే లేదు..!
భాజపాతో జట్టుకట్టే ప్రసక్తే లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఈ దిశగా తనను ఒప్పించేందుకు కొందరు యత్నిస్తున్నారని చెప్పారు.
ముంబయి: కొంతమంది శ్రేయోభిలాషులు తనను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. భాజపా (BJP)తో తమ పార్టీ చేతులు కలపదని ఎన్సీపీ (NCP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) స్పష్టం చేశారు. భాజపాతో ఎలాంటి అనుబంధమైనా.. అది ఎన్సీపీ రాజకీయ విధానానికి సరిపోదని చెప్పారు. సోలాపుర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. అజిత్ పవార్తో శనివారం జరిగిన రహస్య భేటీపై స్పందిస్తూ.. ఒక ఇంటి సభ్యుడిగా ఆయన్ను కలిశానని చెప్పారు.
‘మా పార్టీలో కొందరు (అజిత్ పవార్ వర్గం) వేరే దారి ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే.. మా వైఖరిలోనూ ఏమైనా మార్పు వస్తుందేమోనని కొందరు చూస్తున్నారు. అందుకే.. నన్ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. మా పార్టీ భాజపాతో ఎప్పటికీ జట్టుకట్టదు. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నా’ అని శరద్ పవార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. శరద్ పవార్పై అజిత్ పవార్ వర్గం తిరుగుబాటు చేసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే.
శరద్ పవార్-అజిత్ రహస్య భేటీ..! మహా రాజకీయాల్లో మళ్లీ చర్చ
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్తో రహస్య భేటీ గురించి ప్రశ్నించగా.. ‘అజిత్ నా సోదరుడి కుమారుడు. అతడిని కలవడంలో తప్పేముంది? ఒక ఇంట్లోని సీనియర్ వ్యక్తి.. తన కుటుంబంలోని మరో వ్యక్తిని కలవాలని కోరుకుంటే.. దాంతో ఎటువంటి సమస్య ఉండకూడదు’ అని శరద్ పవార్ పేర్కొన్నారు. అంతకుముందు.. సోలాపుర్లో దివంగత ఎమ్మెల్యే గణపత్రావు దేశ్ముఖ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్తో పవార్ వేదికను పంచుకోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?