TN cabinet: స్టాలిన్.. గాంధీ.. నెహ్రూ!
తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 33 మంది చేత గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన...
ఇంటర్నెట్డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 33 మంది చేత గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కొవిడ్ సాయం కింద ₹4వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాల ధర తగ్గింపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు స్టాలిన్. ఇక స్టాలిన్ మంత్రివర్గాన్ని నిశితంగా పరిశీలిస్తే ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ఒకప్పటి సోవియట్ యూనియన్ నేత అయిన స్టాలిన్.. మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీ, మన తొలి ప్రధాని నెహ్రూ పేర్లు కలిగిన వ్యక్తులు ఒకే కేబినెట్లో ఉండడం విశేషం.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన కరుణానిధి సోవియట్ యూనియన్ నేత స్టాలిన్ అంటే ఎనలేని అభిమానం. దీంతో ఆయన పేరునే తన కుమారుడికి పెట్టుకున్నారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన స్టాలిన్.. తండ్రి హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల తర్వాత తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు తమిళనాడులో చరిత్రలో ముఖ్యమంత్రి వారసలెవరూ సీఎంగా బాధ్యతలు చేపట్టలేదు. స్టాలినే తొలి వ్యక్తి కావడం గమనార్హం. ఇక తిరుచ్చుపల్లికి చెందిన డీఎంకే నేత కేఎన్ నెహ్రూ సైతం ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు మున్సిపల్ నిర్వహణ, పట్టణ తాగునీటి సరఫరా మంత్రిత్వ శాఖను స్టాలిన్ అప్పగించారు. కేఎన్ నెహ్రూ తండ్రి కాంగ్రెస్కు పెద్ద అభిమాని కావడంతో తన కుమారుడికి నెహ్రూ పేరు పెట్టారు. ఇక ఆర్.గాంధీ సైతం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు చేనేత, టెక్ట్స్టైల్స్ మంత్రిత్వ శాఖను కేటాయించారు. చేనేతను ప్రోత్సహించాలని చెప్పిన గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఆయన మంత్రిత్వ శాఖ సైతం ఉండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. అధికార పార్టీ తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..