Ts News: పబ్లు తెరిస్తే రాని కరోనా.. భాజపా నేతలు దీక్ష చేస్తేనే వస్తుందా?: విజయశాంతి
సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తేలుస్తుందని భాజపా సీనియర్ నేత విజయశాంతి అన్నారు. వివిధ జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూమిని
హైదరాబాద్: సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తేలుస్తుందని భాజపా సీనియర్ నేత విజయశాంతి అన్నారు. వివిధ జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూమిని అమ్మేసి బినామీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దానికి సంబంధించిన నివేదికలు పార్టీ అధిష్ఠానానికి వెళ్లాయని.. సరైన సమయంలో చర్యలు తీసుకుంటుందన్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో విజయశాంతి మీడియాతో మాట్లాడారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు సరైంది కాదని ఆక్షేపించారు. భాజపా నాయకులను కరీంనగర్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 31న పబ్లు తెరిస్తే కరోనా రాదు.. రైతుబంధు ఉత్సవాలు జరిపితే కొవిడ్ రాదు.. భాజపా నేతలు దీక్ష చేస్తేనే వస్తుందా?అని ప్రశ్నించారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్తో పాటు భాజపా కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.