Omicron: ఒక్కడోసూ తీసుకోనివారికే ముప్పు: సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్కుమార్
కొవిడ్లో కొత్త రకం ఒమిక్రాన్ గురించి ఓ అంచనాకు రావాలంటే వాస్తవిక సమాచారం(రియల్ టైమ్ డాటా) అందుబాటులోకి రావాల్సి ఉందని
అదే బాటలో రోగపీడిత వయోధికులు
ఒమిక్రాన్పై ఊహాగానాలొద్దు.. నమూనాలు పరీక్షిస్తున్నాం
ఇప్పటికీ అధికంగా వ్యాప్తిలో ఉన్నది డెల్టా రకమే
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్లో కొత్త రకం ఒమిక్రాన్ గురించి ఓ అంచనాకు రావాలంటే వాస్తవిక సమాచారం(రియల్ టైమ్ డాటా) అందుబాటులోకి రావాల్సి ఉందని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్కుమార్ నందికూరి స్పష్టీకరించారు. హైదరాబాద్ వస్తున్న విదేశీ ప్రయాణికుల్లో పాజిటివ్గా తేలిన వారి నమూనాలు తమ ల్యాబ్కు చేరుతున్నాయని ఆయన తెలిపారు. వీటి జన్యుక్రమాలను కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు ఉన్నట్లు వివరించారు. ఒమిక్రాన్ వ్యాప్తిపై భయాందోళనలు రేగుతున్న నేపథ్యంలో ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి.
సీసీఎంబీకి వస్తున్న నమూనాల వైరస్ జన్యుక్రమ ఆవిష్కరణలో ఏం గుర్తించారు..?
అత్యవసర పరిస్థితుల దృష్ట్యా చిన్న యంత్రం నానోపై వాటి జన్యుక్రమాలను కనుగొంటున్నాం. ఇందుకు 48గంటల సమయం పడుతుంది. ఫలితం రాగానే వెల్లడిస్తాం. నమూనాలు పెరిగేకొద్దీ పెద్ద యంత్రంపై జన్యుక్రమాలను కనుగొనే ప్రక్రియ చేపడతాం.
కొత్త వేరియంట్ ముప్పు ఎవరికి ఎక్కువ..?
ఒమిక్రాన్ అయినా మరోటైనా టీకా ఒక్కడోసు కూడా తీసుకోనివారికి అధిక ముప్పు ఉంటుంది. పెద్దల్లో ముఖ్యంగా ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారికీ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కొవిడ్ బారిన పడి రెండు టీకాలు వేయించుకున్నవారికి ఆ ప్రమాదం తక్కువ. ఒక డోసు టీకా తీసుకున్నవారితో పోలిస్తే రెండు డోసులు తీసుకున్నవారికి రక్షణ ఎక్కువ.
రెండు డోసులు తీసుకున్నవారూ కొవిడ్ బారిన పడుతున్నారెందుకు..?
టీకా తీసుకుంటే అసలు కొవిడ్ బారిన పడరని అనలేం. లక్షణాలు పెద్దగా ఉండవంతే. ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్రత ఉండదనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం. రెండు డోసులూ తీసుకున్నాక కూడా కొవిడ్ బారిన పడుతున్నట్లయితే దానిపై శాస్త్రీయ అధ్యయనం జరగాల్సి ఉంది.
ఒమిక్రాన్తో మహమ్మారి దశ ముగియనుందా?
ఒమిక్రాన్ బారిన పడినవారిలో ఇప్పటివరకు ఎక్కువ మంది యువకులని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. సహజంగానే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండే యువకుల్లో వైరస్ లక్షణాలు తక్కువే ఉంటాయి. అలాగని ఒమిక్రాన్తో పెద్దగా ముప్పులేదని అప్పుడే నిర్ధారణకు రాలేం. లక్షణాలు తక్కువనీ చెప్పలేం. అధ్యయనం జరగాల్సి ఉంది.
కేసులు పెరుగుతున్నాయి.. మూడో వేవ్ ముప్పు మొదలైందనుకోవచ్చా..?
అలా ఊహించి చెప్పలేం. జనాభాలో ఇప్పటికే టీకాలు వేయించుకున్నవారు, కొవిడ్ బారిన పడినవారు కలిపి 70 శాతం ఉంటే.. మిగతా 30 శాతం జనాభాకు సోకే అవకాశం ఉంది. టీకా వేసుకున్నాక కూడా కొందరిలో పాజిటివ్ రావొచ్చు. అంతా జాగ్రత్తలు పాటించాల్సిందే. రెండు డోసులూ వేయించుకోవాల్సిందే.
వ్యాప్తిలో ఏరకం వైరస్ ఉంది?
నవంబరు 15 వరకు వచ్చిన నమూనాల్లో 80 నుంచి 90 శాతం వరకు డెల్టా, అందులోని ఉపరకాలే కనిపించాయి. మిగిలిన వాటి ఫలితాలు రావాల్సి ఉంది. కొత్త రకం వైరస్లో స్పైక్ ప్రొటీన్లో 32 ఉత్పరివర్తనాల కారణంగా అది రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకుంటుందని అంచనాలు ఉన్నాయి. వాస్తవిక సమాచారం ఆధారంగా అధ్యయనం చేస్తే తప్ప అది ప్రమాదకారినా.. కాదా.. అనేది చెప్పలేం. వీటిపై ఊహాగానాలు తగదు.
అధిక రక్షణకు బూస్టర్ డోసు అవసరమా?
మనదేశ జనాభా సుమారు 130 కోట్లు. ఇంకా అందరికి వ్యాక్సినేషన్ పూర్తి కాలేదు. రెండో డోసు చాలామంది వేయించుకోవాల్సి ఉంది. ఇది మన మొదటి ప్రాధాన్యం. తర్వాత 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వాల్సి ఉంది. బూస్టర్ డోసుపై ప్రభుత్వం ప్రాధాన్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. మిగతా దేశాలతో పోలిస్తే మనవి భిన్న పరిస్థితులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!