Inzamam Ul Haq: నాకు గుండెపోటు రాలేదు: ఇంజమామ్ ఉల్ హక్
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారంటూ నిన్న వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఇంజమామ్ తాజాగా ఖండించారు.
లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారంటూ నిన్న వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఇంజమామ్ తాజాగా ఖండించారు. తనకు ఎలాంటి గుండెపోటు రాలేదని తెలిపారు. అయితే కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే గుండెలో సమస్య బయటపడిందని చెప్పారు. దానికి చికిత్స తీసుకున్నానని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో బుధవారం ఓ వీడియో విడుదల చేశారు.
అనారోగ్య సమస్యలతో ఇంజమామ్ సోమవారం రాత్రి లాహోర్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు వైద్యులు యాంజియోగ్రఫీ చేశారు. దీంతో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై నేడు ఇంజమామ్ స్పందించారు. ‘‘నాకు గుండెపోటు వచ్చిందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. కడుపులో ఇబ్బంది తలెత్తడంతో డాక్టర్ వద్దకు వెళ్లాను. అక్కడ నాకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎందుకైనా మంచిదని యాంజియోగ్రఫీ కూడా చేశారు. ఆ సమయంలో నా రక్త నాళాల్లో ఒకటి కొంత మూసుకుపోయినట్లు గుర్తించారు. దీంతో స్టంట్ వేశారు. అది విజయవంతమైంది. 12 గంటల తర్వాత నేను ఇంటికి వెళ్లిపోయాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను’’ అని ఇంజమామ్ వివరించారు. తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన అభిమానులు, ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇంజమామ్ పాకిస్థాన్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్గా సేవలందించారు. పాక్ తరఫున 120 టెస్టులు, 378 వన్డే మ్యాచ్లు ఆడారు. 1992 వన్డే ప్రపంచకప్లో విజేతగా నిలిచిన పాక్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నారు. తర్వాత కీలక ఆటగాడిగా మారి జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. 2001 నుంచి 2007 వరకు పాక్ జట్టు సారథిగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: కోహ్లి
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!