బెంగళూరును చిత్తు చేసిన దిల్లీ
దిల్లీ ఆల్రౌండర్ ప్రదర్శనతో మెరిసింది. తొలుత బ్యాట్తో.. తర్వాత బంతితో ఆదిపత్యం చెలాయించి బెంగళూరును చిత్తుగా ఓడించింది. దుబాయ్ వేదికగా సోమవారం కోహ్లీసేనతో జరిగిన మ్యాచ్లో దిల్లీ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ
59 పరుగుల తేడాతో కోహ్లీసేన ఘోరపరాజయం
ఇంటర్నెట్డెస్క్: దిల్లీ ఆల్రౌండర్ ప్రదర్శనతో మెరిసింది. తొలుత బ్యాట్తో.. తర్వాత బంతితో ఆదిపత్యం చెలాయించి బెంగళూరును చిత్తుగా ఓడించింది. దుబాయ్ వేదికగా కోహ్లీసేనతో సోమవారం జరిగిన మ్యాచ్లో దిల్లీ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ.. మార్కస్ స్టాయినిస్ (53*; 26 బంతుల్లో, 6×4, 2×6) అజేయ అర్ధశతకంతో మెరవడంతో 196 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 137 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది. బెంగళూరు జట్టులో కోహ్లీ (43; 39 బంతుల్లో 2×4, 1×1) టాప్ స్కోరర్. దిల్లీ బౌలర్లలో రబాడ (4/24), నోర్జె (2/22), అక్షర్ పటేల్ (2/18) రాణించారు. ఈ విజయంతో శ్రేయస్సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.
భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. 27 పరుగులకే ఓపెనర్లు పడిక్కల్ (4), ఫించ్ (13)ను అశ్విన్, అక్షర్ పటేల్ పెవిలియన్కు చేర్చారు. ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన డివిలియర్స్ (9) తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ డివిలియర్స్ను నోర్జె ఔట్ చేసి బెంగళూరును దెబ్బ తీశాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన మొయిన్ అలీ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయినా కోహ్లీ క్రీజులో ఉండటంతో బెంగళూరు శిబిరంలో ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే హర్షల్ పటేల్ బౌలింగ్లో సిక్సర్ బాది గేర్ మార్చిన కోహ్లీని..తర్వాతి ఓవర్లోనే రబాడ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత దిల్లీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ విజయాన్ని ఖరారు చేసుకున్నారు.
అర్ధశతకంతో మెరిసిన స్టాయినిస్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచి పృథ్వీ షా (42; 23 బంతుల్లో, 5×4, 2×6) బౌండరీల మోత మోగించడంతో దిల్లీకి శుభారంభం లభించింది. అతడికి తోడుగా శిఖర్ ధావన్ (32; 28 బంతుల్లో, 3×4) కూడా మెరవడంతో పవర్ప్లేలో ఆ జట్టు 63 పరుగులు చేసింది. అయితే 7వ ఓవర్లో షాను సిరాజ్ బోల్తా కొట్టించి పరుగుల జోరుకు బ్రేక్లు వేశాడు. కొద్దిసేపటికే ధావన్, శ్రేయస్ అయ్యర్ (11) కూడా ఔటవ్వడంతో స్కోరుబోర్డు నెమ్మదించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్ (37; 25 బంతుల్లో, 3×4, 2×6), స్టాయినిస్ మరో వికెట్ పడకుండా నెమ్మదిగా ఆడటంతో 13వ ఓవర్లో ఆ జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. ఆ తర్వాత స్టాయినిస్ గేర్ మార్చి బౌండరీల మోత మోగించాడు. మొయిన్ అలీ బౌలింగ్లో సిక్సర్, ఫోర్.. సైని ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. పంత్ కూడా చెలరేగంతో పరుగులు పోటెత్తాయి. ఈ క్రమంలో స్టాయినిస్ 24 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆఖరి ఓవర్లో హెట్మెయిర్ (11*) సిక్సర్ బాదడంతో దిల్లీ 196 పరుగులు సాధించింది. గత సీజన్లో స్టాయినిస్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ (2/32) రాణించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?