రైనా నిర్ణయాన్ని గౌరవిస్తాం

రెండు వరుస ఓటములతో నిరాశ చెందిన చెన్నై జట్టు అభిమానులు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా తిరిగి జట్టులో చేరి ఆడాలని సోషల్‌ మీడియాలో కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్పందించారు. తమ జట్టు సీనియర్‌

Published : 27 Sep 2020 00:28 IST

చెన్నై జట్టు సీఈవో విశ్వనాథన్‌..

                                                
దుబాయ్‌: రెండు వరుస ఓటములతో నిరాశ చెందిన చెన్నై జట్టు అభిమానులు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా తిరిగి జట్టులో చేరి ఆడాలని సోషల్‌ మీడియాలో కోరుతున్నారు. 
ఈ నేపథ్యంలో చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్పందించారు. తమ జట్టు సీనియర్‌ ఆటగాడైన రైనా నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైనా గురించి ఆలోచించటం లేదని చెప్పిన విశ్వనాథన్‌.. జట్టు తిరిగి పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో జరిగే క్రికెట్‌ లీగ్‌లలో ఏ జట్టుకు లేనంతమంది అభిమానులు తమ జట్టుకు ఉన్నారని తెలిపిన సీఈవో త్వరలోనే చెన్నై గాడిలో పడుతుందని పేర్కొన్నారు. ఆటలో మంచి రోజులు ఎలా ఉంటాయో.. చెడు రోజులూ కూడా అలాగే  ఉంటాయన్నారు. తర్వాత మ్యాచ్‌కు రాయుడు అందుబాటులోకి వస్తారని ఆయన తెలిపారు. వంద శాతం ఫిట్‌గా లేని రాయుడు తొలి మ్యాచ్‌ తర్వాత ఆడలేదు. రాయుడు చేరికతో జట్టు బ్యాటింగ్‌ విభాగంలో బలపడుతుందని విశ్వనాథన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

ఈ క్రికెట్‌ లీగ్‌లో పాల్గొనేందుకు దుబాయ్‌కి చేరుకున్న రైనా.. ప్రాక్టిస్‌ సెషన్లు జరుగుతుండగానే వ్యక్తిగత కారణాలతో భారత్‌కు తిరిగి వచ్చేశారు. లీగ్‌లో చెన్నై జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింటిలో ఓడింది. రెండో మ్యాచ్‌లోనే బ్యాటింగ్‌ విభాగంలో లోపాలు కనబడినా.. మూడో మ్యాచ్‌కు అవి జట్టుకు తీవ్రంగా నష్టం కలిగించాయి. దీంతో చాలా మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించిన రైనా లేని వెలితి జట్టులో కనిపిస్తోందనే అభిమానుల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని