బిగ్బాష్లోకి యువీ..!
టీమ్ఇండియా ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ మరో ప్రఖ్యాత లీగ్పై కన్నేశాడు. ఆస్ట్రేలియా టీ20 లీగ్ ‘బిగ్బాష్’లో ఆడాలని కోరుకుంటున్నాడు. అతడి కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఫ్రాంచైజీని వెతికే పనిలో పడిందని సమాచారం.....
ఫ్రాంచైజీని వెతుకుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా
మెల్బోర్న్: టీమ్ఇండియా ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ మరో ప్రఖ్యాత లీగ్పై కన్నేశాడు. ఆస్ట్రేలియా టీ20 లీగ్ ‘బిగ్బాష్’లో ఆడాలని కోరుకుంటున్నాడు. అతడి కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఫ్రాంచైజీని వెతికే పనిలో పడిందని సమాచారం.
ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మక క్రికెట్ లీగ్గా ‘బిగ్బాష్’కు పేరుంది. భారతీయులు మినహా ప్రపంచ దేశాల క్రికెటర్లు అందులో భాగం అవుతున్నారు. మహిళా క్రికెటర్లు మినహా పురుషులు ఇతర దేశాల లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లకు మాత్రం అనుమతి ఇస్తోంది. సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్ వంటి వెటరన్ క్రికెటర్లు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన యువీ.. కెనడా టీ20 లీగ్, టీ10 వంటి లీగుల్లో ఆడాడు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం టోర్నీలేమీ జరగడం లేదు. ఎంతో కష్టపడితే గానీ ఐపీఎల్ వంటి లీగులు సాధ్యమవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ‘బిగ్బాష్’లో ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా యువీ కోసం ఓ ఫ్రాంచైజీని గుర్తించే పనిలో పడిందని అతడి మేనేజర్ జేసన్ వార్న్ (డబ్ల్యూ స్పోర్ట్స్, మీడియా) చెప్పినట్టు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్లో ఓ కథనం వచ్చింది.
భారతీయ క్రికెటర్లు బిగ్బాష్లో ఆడితే టోర్నీ విలువ మరింత పెరుగుతుందని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం అధ్యక్షుడు షేన్ వాట్సన్ పేర్కొన్నారు. బిగ్బాష్పై యువీ ఆసక్తి ప్రదర్శించడంపై అతడు స్పందించాడు. ‘ఇలాంటి టోర్నీల్లో భారతీయులు ఆడితే అద్భుతంగా ఉంటుంది. పరిస్థితులు అలాగే ఉన్నాయి. భారత్లో ప్రపంచస్థాయి టీ20 స్పెషలిస్టులు ఉన్నారు. వారు స్వదేశంలో తప్ప ఎక్కడా ఆడటం లేదు. బిగ్బాష్ సహా ప్రపంచ లీగులకు వారు అందుబాటులో ఉంటే బాగుంటుంది’ అని అన్నాడు. ‘ఇదే నిజమైతే టోర్నీల్లో పోటీతత్వమే మారిపోతుంది’ అని పేర్కొన్నాడు. వాట్సన్ ఇప్పుడు చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Rishab Pant: ఆట పట్టించిన అభిమాని.. రిషభ్ పంత్ ఏం చేశాడో తెలుసా?
ప్రముఖ యూట్యూబర్, మరగుజ్జు విభు వర్షిణి (Vibhu Varshney) దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వీరాభిమాని. ప్రాక్టీస్ చేస్తున్న రిషభ్ పంత్ను.. విభు వర్షిణి పలు ప్రశ్నలు అడుగుతూ చిరాకు తెప్పించాడు. దీంతో అతడిని స్టేడియంలో ఉన్న ఓ గేటుపైకి ఎక్కించాడు.
-
KL Rahul: కేఎల్ రాహుల్ మంచి మనసు.. చక్రాల కుర్చీలో ఉన్న అభిమాని దగ్గరికెళ్లి సెల్ఫీ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా బుధవారం హైదరాబాద్తో మ్యాచ్ ఆడేందుకు లఖ్నవూ జట్టు భాగ్యనగరానికి వచ్చింది. అయితే ఓ దివ్యాంగుడు లఖ్నవూ జట్టుకు అభిమాని. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ అభిమాని దగ్గరికెళ్లి కరచాలనం చేసి.. అతడి సెల్ఫోన్ తీసుకుని స్వయంగా సెల్ఫీ దిగాడు.
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
ఐపీఎల్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోర్లు నమోదవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, టాప్ -4లో నిలిచి ప్లేఆఫ్స్కు అర్హత సాధించే జట్లేవనేది ఆసక్తికరంగా మారింది. -
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
హైదరాబాద్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేస్తోంది. లఖ్నవూతో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్ను దిల్లీ ఫీల్డర్ షై హోప్ అద్భుతంగా పట్టాడు. కానీ, బౌండరీ లైన్కు అతడి పాదం తాకిందనే ఆరోపణలు వచ్చాయి. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. -
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
దిల్లీ మళ్లీ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రాజస్థాన్ను ఓడించడంలో ఆ జట్టు బౌలర్ కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
క్యాచ్ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. -
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం