SA vs BAN: విజృంభిస్తున్న సౌతాఫ్రికా బౌలర్లు.. ఘోర ఓటమి దిశగా బంగ్లాదేశ్
ప్రపంచకప్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం దిశగా సాగుతోంది.
ముంబయి: ప్రపంచకప్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. సఫారీలు నిర్దేశించిన 383 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ కనీస పోరాటం కూడా చేయట్లేదు. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్.. 18 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ (22), తాంజిద్ హసన్ (12) పరుగులు చేయగా.. నజ్ముల్ శాంటో (0) ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. షకీబ్ అల్ హసన్ (1), ముష్పీకర్ రహీమ్ (8) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ప్రస్తుతం మహ్మదుల్లా (12*), మెహదీ హసన్ మిరాజ్ (2*) క్రీజులో ఉన్నారు.
లక్ష్యఛేదనలో బంగ్లా మొదటి ఆరు ఓవర్లు నిలకడగానే ఆడింది. అప్పటికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. మార్కో జాన్సన్ వేసిన ఏడో ఓవర్ నుంచి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ గాడితప్పింది. జాన్సన్ వరుస బంతుల్లో తాంజిద్ హసన్, శాంటోలను పెవిలియన్కు పంపాడు. వీరిద్దరూ వికెట్ కీపర్ క్లాసెన్కు క్యాచ్ ఇచ్చారు. తర్వాత వచ్చిన షకీబ్ను పేసర్ లిజాడ్ విలియమ్స్ ఔట్ చేశాడు. అతడు కూడా క్లాసెన్కే క్యాచ్ ఇచ్చాడు. కొద్దిసేపటికే ముష్పీకర్ను కొయిట్జీ వెనక్కి పంపాడు. నిలకడగా ఆడిన ఓపెనర్ లిట్టన్ దాస్ను రబాడ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.